logo

Andhra News: బెదిరించి.. తాళికట్టి.. అత్యాచారం

పాఠశాలలో చదువుకున్న సహచర విద్యార్థినిని రెండేళ్ల అనంతరం ప్రేమ పేరుతో వేధించి, ఆమెను భయపెట్టి.. తాళి కట్టి పలుమార్లు అత్యాచారం చేసిన ఓ యువకుడి ఘాతుకం అనంతపురం నగరంలో వెలుగు చూసింది.

Updated : 12 Nov 2022 07:22 IST

అనంతపురం నేరవార్తలు, న్యూస్‌టుడే: పాఠశాలలో చదువుకున్న సహచర విద్యార్థినిని రెండేళ్ల అనంతరం ప్రేమ పేరుతో వేధించి, ఆమెను భయపెట్టి.. తాళి కట్టి పలుమార్లు అత్యాచారం చేసిన ఓ యువకుడి ఘాతుకం అనంతపురం నగరంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. నగరానికి చెందిన హేమంత్‌ తన క్లాస్‌మేట్‌ అయిన ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. అమ్మాయి ఇంట్లో ఎవరూ లేనపుడు వెళ్లి, ప్రేమించక పోతే తల్లిని, చెల్లిని చంపుతానని బెదిరించేవాడు. భయపడిన ఆమె అతనితో మాట్లాడేది. దీన్ని అదునుగా తీసుకుని ఈ ఏడాది జూన్‌లో అమ్మాయి ఒంటరిగా ఉన్నపుడు ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా తాళి కట్టాడు. ‘ఇక నుంచి నువ్వు నా భార్యవంటూ..’ బ్లాక్‌మెయిల్‌ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. భయభ్రాంతులకు గురైన విద్యార్థిని ఇంట్లో ఉన్నపుడు తాళి దాచిపెట్టుకుని ఉండేది. కర్నూలులో ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతున్న ఆమె ఇటీవల దసరా సెలవులు వచ్చింది. అప్పుడు కూడా ఆమెను వదల్లేదు. సెలవుల అనంతరం కళాశాలకు వెళ్లిన విద్యార్థిని వెంటపడి, అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇటీవల తల్లికి విషయం చెప్పింది. దీంతో ఆమె అనంతపురం దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని