పురుగుల చిక్కీ.. బూజుపట్టిన కర్జూరం: పాత నిల్వలకు కొత్త లేబుళ్లు
జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో గర్భిణులు, బాలింతలకు అందించే అదనపు పౌష్టికాహారాన్ని అక్రమార్కులు వదలడం లేదు.
ఐసీడీఎస్లో నయా మోసం
న్యూస్టుడే: అనంతపురం (శ్రీనివాస్నగర్)
కిట్లోని రకాలు
జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో గర్భిణులు, బాలింతలకు అందించే అదనపు పౌష్టికాహారాన్ని అక్రమార్కులు వదలడం లేదు. సంపూర్ణ పోషణ పథకం కింద పంపిణీ చేస్తున్న ‘వైఎస్ఆర్ కిట్ల’ రూపంలో ప్రతి నెలా రూ.లక్షలు దోపిడీ చేస్తున్నారు. కొందరు సీడీపీఓలు, పర్యవేక్షకులు గుత్తేదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారు. పాత సరకు (నిల్వలు)కు కొత్త లేబుళ్లు (స్టికర్లు) వేసి నయా దందాకు తెర లేపారు. తాజాగా అనంత నగరం రాణినగర్లో ఓ అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన వేరుసెనగ చిక్కీలో పురుగులు బయటపడ్డాయి. మరోచోట ముద్దలా మారిన అటుకుల ప్యాకెట్ బయటకు తీశారు. రాగిపిండిలో ఇసుక, బూజుపట్టిన ఖర్జూరం.. వంటివి వైఎస్ఆర్ కిట్లో వెలుగు చూశాయి. ఉమ్మడి జిల్లాలో నాణ్యతలేని సరకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించడంపై విమర్శలకు దారి తీస్తోంది.
ఏమేమి ఇవ్వాలంటే..
కిట్లో ఆరు రకాల సరకులు ఉంటాయి. రాగిపిండి, జొన్నపిండి, అటుకులు కిలో చొప్పున, బెల్లం, చిక్కీ, ఖర్జూరం 250 గ్రాముల ప్రకారం ఇస్తున్నారు. రావులపాలెం, విశాఖ, నెల్లూరుకు చెందిన గుత్తేదారులు టెండర్లు దక్కించుకున్నారు.
బూజుపట్టిన కర్జూరం
తయారీ తేదీపై సందేహాలు
మొదట్నుంచి కిట్ల తయారీ, ఎమ్మార్పీ, గడువు వంటి వివరాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాత నిల్వలకే కొత్త ప్యాకెట్లను తయారు చేసి.. ఎమ్మార్పీ వివరాలను కూడా కొత్తగా ముద్రిస్తున్నట్లు సమాచారం. అనంత నగరంలో ఈ తరహాలో 136 ప్యాకెట్లు బయటకు పడినట్లు తెలిసింది. సదరు గుత్తేదారుడికి షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. అయినా మార్పు రాలేదు. నాణ్యత, తూకాలపై నిరంతరం ఆహార కల్తీ నిరోధక శాఖ, తూనిక, కొలతల శాఖ పరిశీలన చేయాలి. అవసరమైతే ల్యాబొరేటరీలకు పంపాలి. ఏడాది కాలంలో ఒక్క రోజు కూడా తనిఖీలు జరిగిన దాఖలాలు లేవు. పేదలకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 ప్రాజెక్టుల పరిధిలో 5,126 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గర్భిణులు 27,778 మంది, బాలింతలు 25,504 మంది చొప్పున మొత్తం 53,282 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ వైఎస్ఆర్ కిట్లు ఇస్తున్నట్లు ‘లెక్క’ రాస్తున్నారు. ఒక్కో కిట్లో ఆరు రకాల సరకులు ఉంటాయి. ఒక్కో కిట్ ధర రూ.222. ఈ లెక్కన నెలకు రూ.1,18,28,604 ఖర్చు చేస్తున్నట్టే. 2021 సెప్టెంబరు నుంచి నలుగురు గుత్తేదారులు ఆయా కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.
నాణ్యమైనవే సరఫరా చేస్తాం
కొన్ని ప్రాంతాల్లో నాసిరకం సరకులు ఇచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. గతంలో గుత్తేదారులకు నోటీసులు జారీ చేశాం. తాజాగా నాసిరకం సరకులు ఇచ్చినట్లు తేలితే బిల్లుల్లో కోత పెడతాం. ఇప్పటికే చాలాసార్లు గుత్తేదారులను హెచ్చరించాం. పాత నిల్వలపై కొత్త లేబుళ్లు వేస్తున్నారన్న దానిపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విచారణ చేయిస్తున్నాం.
- బి.ఎన్.శ్రీదేవి, పీడీ, ఐసీడీఎస్
ఉమ్మడి జిల్లా లెక్క
అంగన్వాడీలు: 5,126
గర్భిణులు: 27,778
బాలింతలు: 25,504
వైఎస్ఆర్ కిట్ ధర: రూ.222
నెలకు రూ.1.18 కోట్లు ఖర్చు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధూప, దీప నైవేద్యం.. జగనాధీనం
[ 23-04-2024]
దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తీసుకోవడమేకానీ.. ఇవ్వడం తెలియదన్నట్లుగా.. ఆలయాల నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో జమ చేసుకున్నారుగాని.. తిరిగి పైసా విదిల్చ లేదు. -
ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’
[ 23-04-2024]
ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ వినోద్కుమార్ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటించారు. -
ఊపందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 37 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో అనంత లోక్సభకు 7 ఎనిమిది, అసెంబ్లీ స్థానాలకు 30 సెట్ల ప్రకారం నామినేషన్లు వచ్చాయి. -
పదిలో 24వ స్థానం
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 24వ స్థానానికి పరిమితమైంది. 80.93 శాతం ఉత్తీర్ణత సాధించినా జిల్లాల వారీగా పరిశీలిస్తే చివరన ఉంది. -
గ్రానైట్ పరిశ్రమలపై గునపం
[ 23-04-2024]
చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం. -
ఆస్తి పాస్తులు
[ 23-04-2024]
అభ్యర్థి: కాలవ శ్రీనివాసులు -
తోయండి.. ఇది జగన్మొండి
[ 23-04-2024]
వైకాపా ఐదేళ్ల నిర్లక్ష్య పాలన.. ఉరవకొండ ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి కారణంగా తరచూ బస్సులు నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు వస్తున్న పల్లె వెలుగు బస్సు పట్టణంలోని ప్రధాన రహదారిపై డిపో సమీపంలో గేర్లు పడక ఆగిపోయింది. -
బోధించడం పాపమా.. గురువులపై క్రూరత్వమా?
[ 23-04-2024]
నవ సమాజ నిర్మాతలు గురువులు.. ఎందుకో జగన్కు వీరంటేనే గిట్టదు. తనకు విద్యాబుద్ధులు నేర్పిందీ ఒక గురువే అన్న జ్ఞానాన్ని విస్మరించి.. వారిని శత్రువుల్లా చూస్తూ దండెత్తుతున్నాడు. -
‘అనంత’కు కలిసిరాని నాయకగణం
[ 23-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు. -
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 23-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిందని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భర్తీలో వెనుకబాటు.. పాలన నగుబాటు
[ 23-04-2024]
విద్యుత్తు శాఖ సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. -
పదో తరగతి ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. కళ్యాణదుర్గం మండలంలో 69.12శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 27మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. -
ధర్మవరంలో వైకాపాకు ఝలక్
[ 23-04-2024]
ధర్మవరం నియోజకవర్గంలో వైకాపాలో బీసీ నాయకులుగా మెలిగిన వారు ఆ పార్టీకే ఝలక్ ఇస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో విభేదాలున్న నాయకులు ఒక్కొక్కొరు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
తెదేపాతో అర్హులందరికీ సంక్షేమం: సునీత
[ 23-04-2024]
తెదేపాలో చేరిన వారు భయపడాల్సిన పనిలేదు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్