భూ పత్రాలు.. తప్పుల తిప్పలు!
భూ రీసర్వేలోనే కాదు.. యజమానుల హక్కు పత్రాల ముద్రణలోనూ తప్పులు తెరపైకి వస్తున్నాయి. రెండేళ్ల కిందట రీసర్వేకు శ్రీకారం చుట్టారు. తాజాగా హక్కు పత్రాల పంపిణీ చేపట్టారు.
న్యూస్టుడే: జిల్లా సచివాలయం, కళ్యాణదుర్గం గ్రామీణం, పెద్దవడుగూరు
బోయంపల్లిలో పత్రాలు అందుకున్న రైతులతో మంత్రి ఉష
భూ రీసర్వేలోనే కాదు.. యజమానుల హక్కు పత్రాల ముద్రణలోనూ తప్పులు తెరపైకి వస్తున్నాయి. రెండేళ్ల కిందట రీసర్వేకు శ్రీకారం చుట్టారు. తాజాగా హక్కు పత్రాల పంపిణీ చేపట్టారు. రైతు పేరు, ఇంటి పేరు, లింగం, సర్వే నంబరు, ఆధార్, ఫోన్, విస్తీర్ణం.. ఇలా ప్రతి దాంట్లోనూ తప్పులు ఉన్నాయి. చాలామందికి వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువ ముద్రించారు. వీటిపై రైతులు రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వడం లేదు. వివరాలన్నీ పక్కాగా ఉన్నవే అందజేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. శుక్రవారం తాడిపత్రి, రాప్తాడు, అనంత, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో భూహక్కు పత్రాల పంపిణీ ప్రారంభించారు.
భూమి తక్కువగా ఉంది
నాకు 47-1ఏ4లో 2.84 ఎకరాల భూమి ఉంది. హక్కు పత్రంలో 2.56 ఎకరాలే ముద్రించారు. మిగిలిన 28 సెంట్ల భూమి ఏమైందో తెలియడం లేదు. తాము నష్టపోవాల్సి వస్తుంది. మిగిలిన భూమి జత చేస్తారో లేదో? నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
రుద్రమ్మ, రైతు, బోయలపల్లి
అరకొరగా పంపిణీ
ఉమ్మడి జిల్లాలో 37,715 పత్రాలు అందజేయాల్సి ఉంది. ఒక్క అనంత జిల్లాలోనే ఇప్పటిదాకా 6,726 పత్రాల్లో తప్పులు సరిదిద్దినట్లు జేసీ కేతన్గార్గ్ తెలియజేశారు. దీనికి రెట్టింపు స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. తప్పులు ఉండటంతోనే పూర్తి స్థాయిలో పత్రాలు రైతులకు అందజేయలేదు. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలో 705 మందికి గాను 254 పత్రాలే వచ్చినట్లు తెలుస్తోంది. అందులోనూ పది మందికే ఇచ్చారు. పెద్దవడుగూరు మండలం విరుపాపురం, మల్లేనిపల్లి, వెంకటాంపల్లి, అవులాంపల్లిలో 35 మందికే పత్రాలు ఇచ్చారు.
తొలివిడత 64 గ్రామాలు
ఉమ్మడి జిల్లాలో 2020 నవంబరులో భూ రీసర్వే మొదలైంది. అనంత జిల్లాలో 31 మండలాల్లో 504 గ్రామాలు ఉండగా.. తొలి విడత 13 మండలాల్లోని 41 గ్రామాల్లో 1,15,744 ఎకరాల విస్తీర్ణంలో రీసర్వే ముగించారు. మొత్తం 27,528 హక్కు పత్రాలు రైతులకు అందజేయాల్సి ఉంది. శ్రీసత్యసాయి జిల్లాలో 32 మండలాల్లో 461 గ్రామాలు ఉండగా.. ఇప్పటికి 14 మండలాల పరిధిలోని 23 గ్రామాల్లో 27,202 ఎకరాల విస్తీర్ణంలో సర్వే పూర్తి చేశారు. 10,187 పత్రాలు సిద్ధం చేయాల్సి ఉంది.
తొలివిడత 64 గ్రామాలు
రీసర్వేపై అసంతృప్తి
రెండేళ్లుగా సాగుతున్న భూ రీసర్వేపై క్షేత్రస్థాయిలో రైతుల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సర్వే-సరిహద్దుల చట్టం-1923 ప్రకారం సెక్షన్ 9(1), 9(2) ప్రకారం సర్వేలో సంబంధిత రైతులను పూర్తిగా భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు ఇవ్వాలి. పలు గ్రామాల్లో రైతులు, స్థానికులకు తెలియకుండానే రీసర్వే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వివరాల్లో తప్పులు దొర్లినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్