పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య

కదిరి పట్టణం యర్రగుంటపల్లి సమీపంలోని జగనన్న కాలనీలో శుక్రవారం ఉదయం పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం విద్యార్థి ఆంజనేయులు (17) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated : 26 Nov 2022 05:05 IST

కదిరి పట్టణం, న్యూస్‌టుడే : కదిరి పట్టణం యర్రగుంటపల్లి సమీపంలోని జగనన్న కాలనీలో శుక్రవారం ఉదయం పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం విద్యార్థి ఆంజనేయులు (17) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోన్న ఆంజనేయులు ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని వేలాడుతుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉరి తప్పించారు. అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కదిరి అర్బన్‌ సీఐ మధు తెలిపారు.ఆత్మహత్యకు కారణం దర్యాప్తులో తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని