ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాల్సిందే..
‘జాకీ’ దుస్తుల పరిశ్రమ వెనక్కి వెళ్లడానికి కారణమైన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై సుమోటో కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని సీపీఐ జిల్లా సమితి డిమాండు చేసింది.
డీఐజీ కార్యాలయంలో అఖిలపక్ష నాయకుల ఫిర్యాదు
వినతిపత్రం అందజేస్తున్న సీపీఐ, తెదేపా, కాంగ్రెస్ నాయకులు
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: ‘జాకీ’ దుస్తుల పరిశ్రమ వెనక్కి వెళ్లడానికి కారణమైన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై సుమోటో కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని సీపీఐ జిల్లా సమితి డిమాండు చేసింది. మంగళవారం సీపీఐతో పాటు తెదేపా, కాంగ్రెస్ నాయకులు డీఐజీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీఐజీ అందుబాటులో లేకపోవడంతో క్యాంపు ఆఫీసులోని ఏఆర్ హెడ్కానిస్టేబుల్ ఖాదర్బాషాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాఫర్ మీడియాతో మాట్లాడుతూ.. 2017లో జాకీ పరిశ్రమకు అప్పటి తెదేపా ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ 27 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి రూ.10 కోట్లు డిమాండు చేయడంతో సదరు పరిశ్రమ యాజమాన్యం ముడుపులు ఇచ్చుకోలేక జిల్లా నుంచి వెళ్లిపోయారన్నారు. పరిశ్రమ ఏర్పాటు అయి ఉంటే ఆరు వేలకు పైగా ఉద్యోగాల సృష్టి జరిగేదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆరోపణ చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి సీపీఐ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బెదిరించాడన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శి మల్లికార్జున, నగర కార్యదర్శి శ్రీరాములు, లింగమయ్య, తెదేపా నాయకులు కొండప్ప, నారాయణస్వామి, కాంగ్రెస్ నాయకులు శంకర్, గోవిందు, ఇతర నాయకులు రమణయ్య, అల్లీపీరా పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ