ఒకటిన జీతాలు వచ్చేనా?
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీన జీతం చెల్లింపు కష్టంగా మారింది.
సీఎఫ్ఎంఎస్ సర్వర్ మొరాయింపు
బిల్లుల అప్లోడ్లో కష్టాలు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీన జీతం చెల్లింపు కష్టంగా మారింది. తాజాగా నవంబరు నెల జీతం డిసెంబరు ఒకటో తేదీన వస్తుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారంతో నవంబరు నెల ముగుస్తున్నా జీతాల బిల్లులు పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయలేదు. సీఎఫ్ఎంఎస్ సర్వర్ మొరాయిస్తోంది. ఒక బిల్లు అప్లోడ్కు దాదాపు గంటకుపైగా సమయం పడుతుండటంతో ఖజానా ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ప్రతి నెలా బిల్లులు సకాలంలో అప్లోడ్ చేసినా ఒకటో తేదీ జీతం రావడం కష్టమైంది. అక్టోబరు జీతం నవంబరు రెండో వారం దాకా చెల్లింపులు జరిపారు. ఈక్రమంలో డిసెంబరు ఒకటో తేదీ జీతం చెల్లింపులు అనుమానమే. రెండు రోజుల నుంచి సీఎఫ్ఎంఎస్ సర్వర్ మందగించినట్లు సీనియర్ ఎస్టీఓ ఒకరు ఆవేదనతో చెప్పారు.
3 వేలకుపైగా బిల్లులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 ఉప ఖజానా కార్యాలయాలు (ఎస్టీఓ) ఉన్నాయి. వీటి పరిధిలో 1383 మంది డ్రాయింగ్ డిస్పర్సమెంట్ అధికారులు(డీడీఓ) ఉన్నారు. అన్ని రకాల బిల్లులు 3 వేలకుపైగా అందుతున్నాయి. ప్రతి నెలా 17 నుంచి 25లోపు సంబంధిత డీడీఓల నుంచి ఎస్టీఓ కార్యాలయాలకు జీతాల బిల్లులు అప్లోడ్ చేస్తారు. 26 నుంచి 30లోపు సదరు ఎస్టీఓలు సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిర్దేశిత గడువులోపు సాగాలి. ఈనెల 27 వరకు సర్వర్ వేగంగానే పని చేసింది. రెండు రోజులుగా బాగా మందగించినట్లు తెలిసింది. ఇప్పటికి 60 శాతం బిల్లులే అప్లోడ్ అయినట్లు తెలుస్తోంది. బుధవారంలోపు ప్రక్రియ పూర్తి చేయడం కష్టమేనని ఖజానా ఉద్యోగులు చెబుతున్నారు.
1.37 లక్షల మందిపై ప్రభావం
అనంత, శ్రీసత్యసాయి జిల్లాల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు 1.37 లక్షల మంది ఉన్నారు. ఇందులో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీసు, ప్రజా రవాణా, ఎస్కేయూ, జేఎన్టీయూ, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు 31 వేలు, పెన్షనర్లు 38 వేలు, ఉపాధ్యాయులు 18 వేలు, అప్కాస్ ఉద్యోగులు 25 వేలు, సచివాలయ ఉద్యోగులు 10 వేలు, గెజిటెడ్ అధికారులు 9,700, ఆర్టీసీ ఉద్యోగులు 5 వేలు చొప్పున ఉన్నారు. వీరంతా ప్రతి నెలా ఒకటో తేదీన జీతం కోసం ఎదురుచూస్తుంటారు. ఇంటి అద్దె, సరకులు, నెల వారీగా చెల్లింపులు ఉంటాయి. జీతం ఆలస్యమైతే ఇబ్బందులు పడాల్సిందే.
ప్రక్రియ పూర్తి చేస్తాం
సరళా విజయకుమారి, డీడీ, జిల్లా ఖజానా శాఖ
సీఎఫ్ఎంఎస్ సర్వర్ కొంత నిదానమైంది. ఇప్పుడు ఇబ్బంది లేదు. జీతాల బిల్లులు అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. బుధవారంలోపు పూర్తి చేస్తాం. అన్ని ఎస్టీఓ కార్యాలయాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొన్నిసార్లు సర్వర్ ఇబ్బంది పెట్టినా ఆఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. బిల్లులు అప్లోడ్ చేసేంత వరకే పని.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగు పడిపోయింది జగన్.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం
[ 18-04-2024]
అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
[ 18-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. -
తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి
[ 18-04-2024]
ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. -
19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ
[ 18-04-2024]
ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
[ 18-04-2024]
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్ అగర్వాల్ జిల్లాకు చేరుకున్నారు. -
నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం
[ 18-04-2024]
కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. -
‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం
[ 18-04-2024]
-
మడకశిరలో వైకాపాకు షాక్
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. -
కల్యాణ వైభోగమే..
[ 18-04-2024]
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. -
కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
[ 18-04-2024]
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. -
అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!
[ 18-04-2024]
మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. -
ధర్మవరంలో కూటమి జోరు
[ 18-04-2024]
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. -
నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన్
[ 18-04-2024]
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గురువారం నామపత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు