logo

భార్యపై అనుమానంతో హత్య

మద్యానికి బానిసై, భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను బండరాయితో కొట్టి చంపిన ఘటన తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 30 Nov 2022 05:52 IST

ప్రమీల (పాతచిత్రం)

తాడిపత్రి, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై, భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను బండరాయితో కొట్టి చంపిన ఘటన తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామీణ పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. ప్రమీల (33), ఆమె భర్త పుల్లారెడ్డి వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. తొలుత వీరి కాపురం అన్యోన్యంగానే సాగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.కొన్నాళ్లకు పుల్లారెడ్డి మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవాడు. మంగళవారం సొంతపని నిమిత్తం ఇద్దరూ తాడిపత్రి పట్టణానికి వచ్చి, తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ఆటో దిగి ఇంటికి వెళుతూ దారిలో గొడవ పడ్డారు. ఆ సమయంలో కోపంతో విచక్షణ కోల్పోయిన పుల్లారెడ్డి దారిపక్కన ఉన్న బండరాయితో ప్రమీల తలపై బాదడంతో ఆమె రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందింది. పుల్లారెడ్డి అక్కడ నుంచి వెంటనే పరారయ్యాడు.  నిందితుడిని పోలీసులు గాలించి పట్టుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని