logo

‘దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదాం’

రాష్ట్రానికి పట్టిన ఖర్మ నుంచి బయట పడటానికి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

Published : 01 Dec 2022 06:09 IST

గోడపత్రాలను విడుదల చేస్తున్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తదితరులు

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్రానికి పట్టిన ఖర్మ నుంచి బయట పడటానికి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా తెదేపా కార్యాలయంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమ చైతన్య పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ప్రజలు వేల సంఖ్యలో వస్తున్నారని, దుర్మార్గపు పాలన నుంచి ఆయన కాపాడతారని అంతా విశ్వసిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో 45రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 30వేల కుటుంబాలను కలుస్తామన్నారు. కార్యక్రమంలో తెదేపా ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు, జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్‌చౌదరి, రాష్ట్రకార్యదర్శి ఆదినారాయణ, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు నరసానాయుడు, కేశవరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని