ఎండుకు తిరస్కరించారు?
శాసన మండలి (ఎమ్మెల్సీ) రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటు నమోదుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్సీ ఓటు నమోదుపై సందేహాలు
స్పష్టత ఇవ్వని బీఎల్ఓలు
కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేస్తున్న తెదేపా నాయకులు
* అనంత నగరం అశోక్నగర్లో ఆదినారాయణ స్వగృహంలో నలుగురు పట్టభద్రులు ఉన్నారు. ముగ్గురి దరఖాస్తులు ఆమోదం పొందాయి. మరొకరిది తిరస్కరించారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఓటరు జాబితాలో పేరు లేదు. ఇలా అనంత నగరంలోనే 8,351 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
* కూడేరు మండలంలో 494, రొళ్లలో 182.. ఇలా ప్రతి మండలంలోనూ భారీగానే తిరస్కరించారు. బీఎల్ఓల పరిశీలన సరిగా చేయలేదన్నదే విమర్శ ఉంది. నగరంలోని పోలింగ్ స్టేషన్ 127 పరిధిలో క్రమసంఖ్య 60, 61లో ఒకే వ్యక్తి వివరాలు ఉన్నాయి. ఇలాంటి తప్పిదాలు దొర్లాయి.
న్యూస్టుడే: జిల్లా సచివాలయం: శాసన మండలి (ఎమ్మెల్సీ) రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటు నమోదుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హతలున్నా దరఖాస్తులను పక్కన పెట్టేశారు. ఎందుకు తిరస్కరించారో క్షేత్ర స్థాయిలో బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ), తహసీల్దార్లు చెప్పడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు నమోదు అయ్యాయి. కలెక్టరేట్లోనూ దరఖాస్తుల పరిశీలన హడావుడిగా చేసినట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి అనంత, కడప, కర్నూలు జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా 79,066 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో పట్టభద్రుల దరఖాస్తులు 69,943, ఉపాధ్యాయుల దరఖాస్తులు 9,123 ఉన్నాయి. దీనిపై ఎమ్మెల్సీ అభ్యర్థులు, బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. గురువారం తెదేపా ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి రామగోపాల్రెడ్డి, ఆపార్టీ నాయకులు శ్రీధర్చౌదరి, ఆలం నరసానాయుడు, ఆదినారాయణ, ఎంఎస్ రాజు, డేగల కృష్ణమూర్తి తదితరులు కలెక్టర్ను కలిసి ఆధారాలతోసహా వివరించారు.
దరఖాస్తులు 3,92,526
ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో 3,92,526 మంది దరఖాస్తు చేసుకున్నారు. పట్టభద్రులు 3,61,084 మందిలో 69,943, ఉపాధ్యాయులు 31,442 మందిలో 9,123 దరఖాస్తులను తిరస్కరించారు. అత్యధికంగా అనంత జిల్లాలో 20,055, కడపలో 19 వేలు, కర్నూలులో 17 వేలకుపైగా, నంద్యాలలో 11 వేలుపైనే దరఖాస్తుల ఆమోదం లభించలేదు.
క్షేత్రస్థాయికి వెళ్లకుండానే..
దరఖాస్తుల నమోదు నవంబరు 7తో ముగిసింది. అదే నెల 19 వరకు పరిశీలన, స్క్రూట్నీ సాగింది. కలెక్టరేట్లో ఏడు బృందాలు, ప్రతి మండలంలోనూ బీఎల్ఓలు క్షేత్ర పరిశీలన చేశారు. ఓపెన్ డిగ్రీతోపాటు ఇంటర్ విద్యార్హత పత్రాన్ని చూపించిన దరఖాస్తులను పక్కన పెట్టారు. అనంత, రొళ్ల, ముదిగుబ్బ, కూడేరులో ఎక్కువగా పక్కకు పెట్టినట్లు సమాచారం. బీఎల్ఓలు నేరుగా ఇంటికి వెళ్లి పరిశీలించకుండా.. దరఖాస్తుదారులకు ఫోన్ చేసి వాస్తవ పత్రాలను చూశారు. దాదాపు 70వేల దరఖాస్తుల తిరస్కరణకు కారణం ఏమిటో స్పష్టత ఇవ్వలేదు.
పునఃపరిశీలన చేయాలి
ఓటు నమోదు దరఖాస్తుల పరిశీలన సక్రమంగా చేపట్టలేదు. అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గి కొన్నిచోట్ల అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇదే విషయాన్ని ఆధారాలతోసహా కలెక్టర్ నాగలక్ష్మికి విన్నవించాం. అన్నింటిని పునఃపరిశీలన చేయాలి.
రామగోపాల్రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం