logo

యూటీఎఫ్‌ నాయకుల జాగరణ

విజయవాడలో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం, పోలీసులు భగ్నం చేయడంతో గురువారం రాత్రి 12 గంటల వరకు మడకశిరలో యూటీఎఫ్‌ నాయకులు జాగరణ కార్యక్రమం నిర్వహించారు.

Updated : 02 Dec 2022 07:45 IST

నిరసన తెలియజేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

మడకశిర, న్యూస్‌టుడే: విజయవాడలో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం, పోలీసులు భగ్నం చేయడంతో గురువారం రాత్రి 12 గంటల వరకు మడకశిరలో యూటీఎఫ్‌ నాయకులు జాగరణ కార్యక్రమం నిర్వహించారు. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని యూటీఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.భూతన్న తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ మండల అధ్యక్షులు మాలింగప్ప, ఎస్‌టీయూ నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు