Anantapur: శింగనమల కేజీబీవీలో 40 మంది విద్యార్థినులకు అస్వస్థత

అనంతపురం జిల్లా శింగనమల మండలం కస్తూర్బా గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు చేసుకున్నారు.

Published : 02 Dec 2022 21:32 IST

శింగనమల: అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయంలో  40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం తిన్న వీరంతా ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.  సాయంత్రానికి ఈ సంఖ్య 40కి చేరుకుంది. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని శింగనమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం  అక్కడి నుంచి 8మందిని  అనంతపురం  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  పాఠశాలలో మొత్తం 200 మంది విద్యార్థినులు ఉన్నారు. మధ్యాహ్నం వీరంతా పప్పు, అన్నం, రసం, మజ్జిగతో భోజనం చేసినట్లు పాఠశాల సిబ్బంది  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని