అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు?
ప్రభుత్వమే మనదైనప్పుడు.. ప్రభుత్వ భూములు మాత్రం మనవి కావా? అని అనుకున్నారేమో.. ముదిగుబ్బ మండలంలో వైకాపా నాయకులు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు.
13 ఎకరాల గుట్టను మింగేసిన వైకాపా నాయకులు
గుంజేపల్లి పరిధిలోని 1190-2, 4 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. స్థానిక వైకాపా నాయకులు సుమారు అర ఎకరా స్థలాన్ని కబ్జా చేశారు. ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, ముదిగుబ్బ: ప్రభుత్వమే మనదైనప్పుడు.. ప్రభుత్వ భూములు మాత్రం మనవి కావా? అని అనుకున్నారేమో.. ముదిగుబ్బ మండలంలో వైకాపా నాయకులు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. నియోజకవర్గంలో కీలక నాయకుడి అండ, అధికారుల సహకారంతో మండల కేంద్రం చుట్టూ సెంటు భూమి ఖాళీ లేకుండా ఆక్రమించేస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారి ప్రభుత్వ భూముల్లో పాతిన హెచ్చరిక బోర్డులను సైతం తొలగించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు సాగిస్తున్నారు. ఇళ్ల స్థలాలకు డిమాండు పెరగడంతో గుట్టలను చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. రోడ్లను సైతం ఆక్రమించుకుని భవనాలు కడుతున్నారు. సెంటు రూ.2 లక్షలు చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కోర్టులో ఉన్న భూముల్ని సైతం వదల్లేదు. రెవెన్యూ అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప కనీస చర్యలు తీసుకోవడం లేదు.
అధికారుల అండతోనే..
ముదిగుబ్బకు ఆనుకుని జాతీయ రహదారి బైపాస్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతంలో భూముల ధర అమాంతం పెరిగింది. అసైన్డ్భూముల్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి లేఅవుట్లు వేశారు. వ్యవసాయ భూముల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి విక్రయించేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. చుట్టుపక్కల అసైన్డ్భూములు ఖాళీ లేకపోవడంతో ప్రభుత్వ భూములపై వైకాపా నాయకుల కన్ను పడింది. ముదిగుబ్బకు ఆనుకుని గుట్టలన్నింటినీ చదును చేసేస్తున్నారు. మండల కేంద్రానికి ఆనుకుని ఇప్పటికే 20 ఎకరాలు వారి చేతుల్లోకి వెళ్లిపోయింది.
మండల నాయకుడి దందా
ముదిగుబ్బ ఆనుకుని గుంజేపల్లి, దొరిగల్లు పొలం పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణ వెనుక మండలానికి చెందిన వైకాపా కీలక నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఇతరులకు కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తొలుత ప్రభుత్వ భూముల్లో కొంతమంది ద్వారా పునాదులు తవ్విస్తున్నారు. పాత తేదీలతో నకిలీ ఇంటి పట్టాలు సృష్టించి.. గతంలోనే ప్రభుత్వం తమకు భూమి కేటాయించిందని బుకాయిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు లేకపోవడం వీరికి కలిసొస్తోంది. సదరు నాయకుడి భూదందాపై సొంత పార్టీ నాయకులే ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల మండల సర్వసభ్య సమావేశంలో భూ ఆక్రమణపై రెవెన్యూ అధికారుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
మా దృష్టికి రాలేదు
నాగేంద్రకుమార్, తహసీల్దార్, ముదిగుబ్బ
జాతీయ రహదారికి ఆనుకుని 1224, 1225 సర్వే నంబర్లలో ఉన్న నల్లగుట్ట ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి రాలేదు. పరిశీలించి ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకుంటాం. స్టేడియం స్థలాన్ని ఆక్రమించిన వారికి గతంలోనే నోటీసులు ఇచ్చాం. హెచ్చరిక బోర్డుకూడా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో స్థలం కబ్జాకు గురికాకుండా కంచె ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ స్థలాలపై పూర్తిస్థాయిలో సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి
[ 24-04-2024]
ఎన్నికల విధులకు నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఇసుకంతైనా భయం లేదు.. దోపిడీ ఆగదు
[ 24-04-2024]
ఆస్తిని పంచుకున్నట్లు.. ప్రకృతి వనరులైన నదులు, వాగులు, వంకలను వైకాపా నాయకులు పంచేసుకున్నారు. జగన్ అండతో నదుల్ని వాటాలేసుకుని మరీ అక్రమ రవాణా కొనసాగించారు. ఉమ్మడి అనంత జిల్లాలోని పెన్నా, చిత్రావతి, వేదవతి, జయమంగళి తదితర నదుల్ని నామరూపాల్లేకుండా చేశారు. -
నమ్మండి.. జగనన్న కాలనీనే..
[ 24-04-2024]
వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి, గూళ్యపాళ్యం, కమలపాడు, పీసీప్యాపిలి గ్రామాల్లోని జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండిపోయాయి. గడేహోతూరులో 73 ఇళ్లు, వజ్రకరూరులో 578 పట్టాలకుగాను 121, కొనకొండ్లలో 830కుపైగా పట్టాలు పంపిణీ చేస్తే 181 ఇళ్లు పూర్తయ్యాయి. -
ఒకే రోజు యాభై నామినేషన్లు
[ 24-04-2024]
జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు ఏకంగా యాభై నామినేషన్లు దాఖలు కావడం విశేషం. పార్లమెంటు స్థానానికి రెండు వచ్చాయి. -
దేవుడి భూమినీ గుల్ల చేశారు
[ 24-04-2024]
జిల్లాలోని పెద్దవడుగూరుకు కూతవేటు దూరంలో ఉన్న నెలగొండరాయుడుస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే సంఖ్య 777-ఎలోని 21.04 ఎకరాల ఎర్రనేల భూముల్లో వైకాపా నేతల కన్ను పడింది. -
రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే భోజనం
[ 24-04-2024]
రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్ తెలిపారు. -
జగన్ .. ఇంకా పరిహారం ఇవ్వలే
[ 24-04-2024]
భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను. -
ఉద్యాన రైతుల ఊపిరితీస్తున్న జగన్!
[ 24-04-2024]
రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు. -
విజయీభవ..
[ 24-04-2024]
ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కలిశారు. -
చేపా..చేపా.. నువ్వెందుకు ఈదలేదు!
[ 24-04-2024]
వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది. -
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు
[ 24-04-2024]
దయ్యాలకుంటపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులో గువ్వలగొండి కొండలో ఫాం పాండు పనులు చేస్తున్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తున్నా.. చర్యలు సున్నా
[ 24-04-2024]
ఉద్యోగులు యథేచ్ఛగా వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నా అధికారులకు కన్పించడం లేదు. కోడ్ ఉల్లంఘించే వారిపై పరిశీలించి సొంతంగా చర్యలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. -
జగన్ పాలనలో .. ఉద్యానాలు కనుమరుగు
[ 24-04-2024]
జగన్ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు. -
తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తును బాగుచేద్దాం
[ 24-04-2024]
సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తు తరాలను బాగుచేద్దామని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విజయనగర్ కాలనీలో మంగళలవారం ఆయన పర్యటించారు. -
ధర్మవరంలో కూటమి సందడి
[ 24-04-2024]
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది. -
కొండను తవ్వి.. వంకలు పూడ్చి
[ 24-04-2024]
వైకాపా నాయకుల అండతో కొందరు కొండలను మాయం చేస్తున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆక్రమణలకు తెగబడుతున్నారు. కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ పంచాయతీలో ఉన్న కుర్లపల్లి గ్రామ సమీపంలో ఓ రియల్టర్ (భూ వ్యాపారస్థుడు) కొన్నేళ్ల క్రితం భూముల్ని కొనుగోలు చేశాడు. -
లేపాక్షికి యునెస్కో గుర్తింపు తెస్తాం
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అటువంటి లేపాక్షిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్