అద్దె తగ్గించరు.. ఎవరూ ముందుకు రారు!
భారత రైల్వేలో మొట్టమొదటిసారిగా రైలు బోగీని హోటల్గా మార్చిన గుంతకల్లు అధికారులు దాన్ని వినియోగంలోకి తేవడంలో విఫలమయ్యారు.
రెండేళ్లుగా దిష్టిబొమ్మలా మిగిలిన రైలు బోగీ క్యాంటీన్
ప్రారంభానికి నోచుకోని రైలుబోగీ క్యాంటీన్
గుంతకల్లు, న్యూస్టుడే: భారత రైల్వేలో మొట్టమొదటిసారిగా రైలు బోగీని హోటల్గా మార్చిన గుంతకల్లు అధికారులు దాన్ని వినియోగంలోకి తేవడంలో విఫలమయ్యారు. రెండు సంవత్సరాల కిందట దాన్ని గుంతకల్లు రైల్వే జంక్షన్ ముందు ఏర్పాటు చేశారు. దీని అద్దెను నిర్ధారించే బాధ్యతను తీసుకున్న అకౌంట్స్ విభాగానికి చెందిన అధికారి ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించటానికి కూడా అధికారులు జంకుతున్నారు. రైలు బోగీ క్యాంటీన్కు సంవత్సరానికి రూ.40 లక్షలు అద్దెగా ఆయన నిర్ధారించారు. ఆ మేరకు వాణిజ్య విభాగం అధికారులు టెండర్లను నిర్వహిస్తే.. అద్దె అధికంగా ఉండటంతో గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బోగీ వృథాగా పడుంది. అద్దెను తగ్గిసే లేనిపోని అనుమానాలతో రైల్వే విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తారేమోనన్న భయం వీరిలో నెలకొంది. బోగీని ఏర్పాటు చేయడానికి, దాన్ని ఏర్పాటుచేసిన ప్రదేశాన్ని తీర్చిదిద్దడానికి అధికారులు అప్పట్లోనే రూ.20 లక్షలకు పైగా వ్యయం చేశారు. ఇక్కడ బోగీని క్యాంటీన్గా మార్చిన వైనంపై ఇతర డివిజన్ల వారు సమాచారాన్ని తీసుకుని తమ ప్రాంతాల్లో ఇలాంటివి ఇప్పటికే ప్రారంభించినా.. గుంతకల్లులో మాత్రం అడుగు ముందుకు పడలేదు. బోగీని ప్రారంభించి ఉంటే రైలు ప్రయాణికులకు స్టేషన్ వెలుపల అల్పాహారాన్ని పొందే సౌకర్యం అందుబాటులోకి వచ్చేది. రైల్వేకు కూడా పెద్దఎత్తున ఆదాయం లభించేది. దీన్ని అద్దెకు ఇచ్చే విషయంలో అధికారులు తగిన నిర్ణయం తీసుకుని, వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అనాలోచిత నిర్ణయం వల్లే..
రైలు బోగీ క్యాంటీన్ను ముందుగా కొన్ని నెలలపాటు ప్రయోగాత్మకంగా నిర్వహించి వ్యాపారం ఏ మేరకు ఉంటుందో అంచనా వేయాలి. దాన్ని బట్టి అద్దెను నిర్ధారించాలి. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియను చేపట్టి ఉంటే ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని చెబుతున్నారు. అనాలోచితంగా అధిక మొత్తంలో అద్దెను నిర్ధారించటం వల్లే.. దాన్ని తీసుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదు. పర్యవసానంగా రెండేళ్లుగా దిష్టిబొమ్మలా మిగిలింది. దీనిపై సంబంధిత అధికారులను అడుగగా.. టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, అద్దెను తగ్గించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఉన్నతాధికారులేనని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.