logo

ఉద్యోగం రాలేదని యువకుడి బలవన్మరణం

ఉన్నత చదువు చదివినా ఉద్యోగం రాలేదనే కారణంతో మనోవేదనకు గురైన సంజయ్‌ కుమార్‌ (27) అనే యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 03 Dec 2022 02:35 IST

సంజయ్‌కుమార్‌ (పాత చిత్రం)

నార్పల గ్రామీణం, న్యూస్‌టుడే: ఉన్నత చదువు చదివినా ఉద్యోగం రాలేదనే కారణంతో మనోవేదనకు గురైన సంజయ్‌ కుమార్‌ (27) అనే యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన వెంకటరాముడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమారుడు సంజయ్‌ కుమార్‌ను హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదివించారు. చదువు పూర్తిచేసి రెండేళ్ల నుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో వీరి కుటుంబం బొందలవాడ నుంచి నార్పలకు మకాం మార్చారు. రెండేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో శుక్రవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో సంజయ్‌కుమార్‌ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అప్పటికే మృతిచెందాడు. చేతికి వచ్చిన కుమారుడు ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని