logo

అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి

కుందుర్పి సమీపంలోని దెయ్యాలదిబ్బ వద్ద చిరుత కళేబరాన్ని శనివారం సాయంత్రం కొందరు మేకల కాపరులు గుర్తించారు.

Published : 04 Dec 2022 04:35 IST

చిరుత కళేబరం

కుందుర్పి, న్యూస్‌టుడే: కుందుర్పి సమీపంలోని దెయ్యాలదిబ్బ వద్ద చిరుత కళేబరాన్ని శనివారం సాయంత్రం కొందరు మేకల కాపరులు గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయి ఉందని సమీప కాలనీవాసులు తెలిపారు. చిరుత కళేబరంపై గాయాలు ఉన్నాయన్నారు. వేటగాళ్లు చంపేశారా లేక ప్రమాదావశాత్తు మృతి చెందిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అటవీ రేంజ్‌ అధికారి రాంసింగ్‌, డిప్యూటీ అధికారి లక్ష్మప్ప చిరుత కళేబరాన్ని పరిశీలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని