అరాచక పాలనకు చరమగీతం పాడదాం : పల్లె
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అరాచక పాలనకు చరమగీతం పాడదామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు.
ఇంటింటా ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి రఘునాథరెడ్డి
ఓబుళదేవరచెరువు: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అరాచక పాలనకు చరమగీతం పాడదామని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని టి.కుంట్లపల్లి పంచాయతీలోని పెద్దసానివారిపల్లి, తాటిమేకలపల్లి, టి.కుంట్లపల్లి, చెర్లోపల్లి గ్రామాల్లో శనివారం ఆయన ‘ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్లోని 8 వేల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పరిశ్రమలు నెలకొల్పాలని లేదా భూములు ఇచ్చిన రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండు చేశారు. ఆచర సాధ్యం కాని మూడు రాజధానుల అంశాన్ని ప్రజల్లోకి పంపించి విద్వేశాలు రెచ్చకొడుతూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. అక్రమాలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ
-
Sports News
Australian open: కెరీర్ చివరి మ్యాచ్లో సానియాకు నిరాశ.. మిక్స్డ్ డబుల్స్లో ఓటమి