logo

ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషి

సమాజంలోని అంతరాలు పోయి ఉత్తమ సమాజం ఏర్పడాలన్న కాంక్షతో అంబేడ్కర్‌ పనిచేశారని కలెక్టరు నాగలక్ష్మి పేర్కొన్నారు.

Published : 07 Dec 2022 04:15 IST

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కలెక్టరు నాగలక్ష్మి, అహుడా ఛైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌ తదితరుల నివాళి

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: సమాజంలోని అంతరాలు పోయి ఉత్తమ సమాజం ఏర్పడాలన్న కాంక్షతో అంబేడ్కర్‌ పనిచేశారని కలెక్టరు నాగలక్ష్మి పేర్కొన్నారు. అనంతపురంలో మంగళవారం అంబేడ్కర్‌ వర్ధంతి నిర్వహించారు. జడ్పీ కార్యాలయం వద్ద  అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చదువుపై  దృష్టి సారించాలన్నారు. ఎంపీ రంగయ్య మాట్లాడుతూ భారతదేశ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఆయన ఆలోచనలు ప్రభావం చూపాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మేయర్‌ వసీం, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి విశ్వమోహన్‌రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి అన్నాదొర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని