సాయం అందక,,,పూట గడవక!
నా భర్త మంజునాథ మే 20న అనారోగ్యంతో మృతి చెందారు. మాకు ఇద్దరు పిల్లలు. భర్త చికిత్స కోసం పలుచోట్ల అప్పులు చేశా. ఆయన మరణంతో కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది
వైఎస్సార్ బీమా చెల్లింపులో నిర్లక్ష్యం
బాధితులకు దక్కని భరోసా
కూలీకి వెళ్తేనే జీవనం
లక్ష్మీ, ఆర్.కొత్తపల్లి, గుమ్మఘట్ట
నా భర్త మంజునాథ మే 20న అనారోగ్యంతో మృతి చెందారు. మాకు ఇద్దరు పిల్లలు. భర్త చికిత్స కోసం పలుచోట్ల అప్పులు చేశా. ఆయన మరణంతో కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కూలీ పనులకు వెళుతున్నా. పిల్లల పోషణ భారంగా మారింది. ఒక్కరోజు కూలీకి వెళ్లకపోయినా పూటగడవని పరిస్థితి. వైఎస్ఆర్ బీమా వస్తుందని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నా.
ఆరు నెలలైనా చిల్లిగవ్వ అందలేదు.
బెంగళూరుకు వలస వెళ్లా
నా భర్త అక్కిశెట్టి డ్రైవర్గా కుటుంబాన్ని పోషించేవారు. ఆరు నెలల కిందట అనారోగ్యంతో మరణించాడు. స్థానికంగా కూలీ పనులు లభించకపోవడంతో ఇద్దరు పిల్లలను మా అమ్మవద్ద వదిలి బెంగళూరుకు వలస వచ్చా. గ్రామానికి చెందిన యానిమేటర్ నా భర్తకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. ఆరు నెలలు గడిచినా సాయం అందలేదు.
అనురాధ, గంగినేపల్లి, చెన్నేకొత్తపల్లి
అనంతపురం జిల్లాలో ఈఏడాది సహజ మరణం పొందిన కుటుంబాలకు ఇప్పటివరకు సాయం అందలేదు. మొత్తం 500 కుటుంబాలకు రూ.5 కోట్లు రావాల్సి ఉంది. ప్రమాదాల్లో ఈ ఏడాది 78 మంది చనిపోగా.. 19 కుటుంబాలకు మాత్రమే బీమా పరిహారం అందింది. 59 కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. వీరికి రూ.2.95 కోట్లు అందాలి. శ్రీసత్యసాయి జిల్లాలో 2021-22కు సంబంధించి 957 మంది సహజ మరణం పొందగా.. 534 బాధిత కుటుంబాలకు రూ.5.34 కోట్ల సాయం పెండింగ్లో ఉంది. అదే ఏడాదిలో ప్రమాదంలో మృతి చెందిన 21 మంది కుటుంబాలకు రూ.1.05 కోట్లు అందాల్సి ఉంది. 2022-23కు సంబంధించి శ్రీసత్యసాయి జిల్లాలో 453 మంది సహజ మరణం పొందగా.. ఒక్క కుటుంబానికీ బీమా సొమ్ము జమ కాలేదు. రూ.4.53 కోట్లు పెండింగ్లో ఉంది. ప్రమాదాల్లో చనిపోయిన 9 మందికి రూ.45 లక్షలు అందాలి. రెండు జిల్లాలో కలిపి 1067 బాధిత కుటుంబాలకు రూ.19.32 కోట్లు వైఎస్సార్ బీమా పరిహారం రావాల్సి ఉంది.
ఈనాడు డిజిటల్, అనంతపురం: ‘కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే 15 రోజుల్లోగా వైఎస్సార్ బీమా చెల్లిస్తాం. మొత్తం నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తాం. కేంద్రం కోత విధించిన 50 శాతం వాటాను కూడా మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. గతంతో పోలిస్తే బీమా సాయం పెంచాం’ అంటూ ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతూ వచ్చారు. బీమా సొమ్ము మంజూరులో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో బాధితులు ఎంతోమంది సాయం కోసం నెలలుగా ఎదురుచూస్తున్నారు. అధికారులు వివరాలు నమోదు చేసుకుని ఏడాది దాటినా పరిహారం అందలేదు. సాయం ఎప్పుడు అందుతుందో తెలియక పొట్టకూటి కోసం కొందరు వలస వెళ్లారు. మరికొందరు రోజువారీ కూలీలుగా జీవిస్తున్నారు.
కొడుకు చదువు మాన్పించా
నా భర్త బెస్త రామచంద్ర మే 28న అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడు హర్ష, కుమార్తె హారతి ఉన్నారు. ఇళ్లల్లో పాచిపనులు చేసి పిల్లల్ని పోషిస్తున్నా. నా కుమారుడు ఇంటర్ పూర్తి చేశాడు. పై చదువులు చదివించలేక మాన్పించేశా. కుమార్తె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సచివాలయ సిబ్బంది నా భర్త వివరాలు నమోదు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా బీమా నగదు జమ కాలేదు.
సుంకమ్మ, ఆత్మకూరు
వివరాలు పంపించాం
- నరసింహారెడ్డి, పీడీ, డీఆర్డీఏ
వైఎస్సార్ బీమాకు సంబంధించి బాధిత కుటుంబాల వివరాలను సచివాలయాల వారీగా నమోదు చేశాం. విడతల వారీగా ఖాతాల్లో జమవుతున్నాయి. అనంతపురం జిల్లాలో సుమారు 500 మందికి బీమా సొమ్ము రావాల్సి ఉంది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు బీమా సంస్థల నుంచి నేరుగా సాయం అందుతుంది. మిగిలిన వారికి త్వరలోనే జమ చేస్తారు.
ఏడాదిన్నరగా నిరీక్షణ
కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే.. సహజ మరణానికి రూ.లక్ష బీమా అందిస్తారు. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5 లక్షలు బాధిత కుటుంబాలకు అందజేస్తారు. సహజ మరణాలకు సంబంధించి బాధితులు ఏడాదిన్నరగా బీమా సొమ్ము కోసం ఎదురుచూస్తున్నాయి. క్లెయిమ్లను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అమలుకు నోచుకోవడం లేదు. నిబంధనల మార్పుతో చాలా కుటుంబాలు బీమాకు దూరమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కుటుంబంలో ఇద్దరికి బీమా వర్తింపజేశారు. ప్రస్తుతం కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)