logo

వీర జవానుల సేవలు చిరస్మరణీయం

వీర మరణం పొందిన జవానుల సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. త్రిసాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక నిధికి విరాళాల సేకరణ ప్రక్రియను బుధవారం కలెక్టర్‌ తన బంగ్లాలో ప్రారంభించారు.  

Published : 08 Dec 2022 04:34 IST

హుండీలో విరాళం వేస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: వీర మరణం పొందిన జవానుల సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. త్రిసాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక నిధికి విరాళాల సేకరణ ప్రక్రియను బుధవారం కలెక్టర్‌ తన బంగ్లాలో ప్రారంభించారు.  ఆమె మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమానికి విరాళాలు సేకరించడం అభినందనీయమన్నారు. అనంతరం వీర జవానుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి, మాజీ సైనికులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని