logo

అనాథ పిల్లలకు ఎన్‌ఆర్‌ఐల చేయూత

శెట్టూరు మండలం బసంపల్లికి చెందిన చిన్నారులు అశ్వని, లక్ష్మి రెండు నెలల కిందట తల్లిదండ్రులను కోల్పోయారు

Published : 08 Dec 2022 04:34 IST

అశ్వని, లక్ష్మిలకు రూ.6 లక్షల చెక్కు అందజేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

రుద్రంపేట, న్యూస్‌టుడే: శెట్టూరు మండలం బసంపల్లికి చెందిన చిన్నారులు అశ్వని, లక్ష్మి రెండు నెలల కిందట తల్లిదండ్రులను కోల్పోయారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు మేమున్నామంటూ మానవత్వం చాటుకున్నారు. బుధవారం కమ్మభవన్‌లో తానా ఫౌండేషన్‌ ట్రస్టీ పురుషోత్తం చౌదరి ఆధ్వర్యంలో అనాథ పిల్లకు రూ.6 లక్షలు చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం నాయకులు కొండయ్య, మణి, సరిపూటి సూర్యనారాయణ, వెంకటసుబ్బయ్య, రామకృష్ణ, ఆచార్య నారాయణ, శ్రీరాములు, రాజారావు, వెంకటరామయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని