చెప్పింది వింటారా బదిలీపై వెళతారా!
అధికారులపై వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్లు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు.
అధికారులకు వైకాపా నాయకుల బెదిరింపులు
శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ మున్సిపల్ కమిషనర్ 22 రోజులపాటు సెలవు పెట్టారు. స్థానిక కౌన్సిలర్ల ఒత్తిడి తట్టుకోలేకనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఓ వార్డు కౌన్సిలర్, కమిషనర్ మధ్య పలు అంశాలపై వివాదం నడుస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధికి ఇరువురు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధి కౌన్సిలర్కు వత్తాసుగా మున్సిపల్ కమిషనర్ను మందలించినట్లు సమాచారం. మనస్తాపానికి గురైన అధికారి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ప్రజాప్రతినిధి అనుచరుడి సమీప బంధువుకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీసు అధికారిని ఇటీవల వీఆర్కు పంపించారు. ముందునుంచీ ఆ అధికారి స్థానిక ప్రజాప్రతినిధికి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కొన్ని విషయాల్లో తమ మాట వినలేదని వైకాపా నాయకులు కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులపై దాడి విషయంలో ప్రజాప్రతినిధి అనుచరులపై కేసు నమోదు చేశారు. వారు ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉండగానే ఆరెస్టు చేయడంతో సదరు అధికారిపై
కోపం పెంచుకున్నట్లు తెలిసింది.
శ్రీసత్యసాయి జిల్లాలో మద్యం, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుగా ఉన్నారనే కారణంతో ఓ సీఐను బదిలీ చేయించారు. ఆయన వాహనం డ్రైవర్తోనే కేసు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారు. అయినా తమ దారికి రాకపోవడంతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఇతర ప్రాంతానికి బదిలీ చేయించారు.
ఉరవకొండ నియోజకవర్గంలో అధికారపార్టీ నాయకుల భూఅక్రమాలకు రెవెన్యూ అధికారులు బలవుతున్నారు. ఆ నియోజకవర్గంలో పనిచేయాలంటేనే భయపడుతున్నారు. ఉరవకొండ, కూడేరు మండలాల్లో తహసీల్దార్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. విడపనకల్లు ఈవోఆర్డీ వజ్రకరూరు మండల ఇన్ఛార్జి ఎంపీడీవోగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గానికి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయంతో ఆయన్ను బదిలీ చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో పనిచేసే ఓ సీఐపై అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. గతంలో సీఐపై ఒత్తిడి తెచ్చి సెలవుపై వెళ్లేలా చేశారు. తర్వాత కొద్దిరోజులకు ఆ సీఐ అక్కడికే పోస్టింగ్ తెచ్చుకున్నారు. తనకు ఇష్టం లేకుండా నియోజకవర్గంలో ఎలా పనిచేస్తారంటూ.. మళ్లీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని సీఐపై స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఈనాడు డిజిటల్, అనంతపురం: అధికారులపై వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్లు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. అనుచరులు, అయినవారి లబ్ధి కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనులను కూడా చేసి పెట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. ఆరు నూరైనా చెప్పింది చేసి తీరాలని పట్టుబడుతున్నారు. మాట వినకపోతే సెలవుపై వెళ్లాలని, లేదంటే తామే బదిలీ చేయిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు అధికారులు ఒత్తిళ్లు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్తున్నారు.
వేటు తప్పదంటూ హెచ్చరిక
మాట వినని పక్షంలో బదిలీ తప్పదంటూ అధికారులను బెదిరిస్తున్నారు. ముఖ్యంగా కిందిస్థాయి సిబ్బందిపై వైకాపా నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. మండల పరిధిలోని రెవెన్యూ ఉద్యోగులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగానే నడుచుకోవాలి. లేదంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని మండలాల్లో తమకు తెలియకుండా మ్యుటేషన్లు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో కిందిస్థాయి ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కౌన్సిలర్లకు చెప్పకుండా ఎలాంటి పనులు చేయకూడదు. భూవివాదాలకు సంబంధించి తమ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోకూడదని ఆదేశాలిస్తున్నారు. సాగు పట్టాల పంపిణీ నేపథ్యంలో ఈ తరహా ఒత్తిళ్లు రెవెన్యూ సిబ్బందిపై ఎక్కువయ్యాయి.
పోలీసులపైనా పెత్తనం
శాంతి భత్రతల పరిరక్షణ పోలీసుల విధి. కుల, మతాలు, రాగద్వేషాలకు అతీతంగా చట్టాన్ని అమలు చేయాలి. ఆ దిశగా పనిచేస్తున్న కొంతమంది అధికారులపై వైకాపా నాయకుల పెత్తనం ఎక్కువైంది. పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉన్న ప్రతి కేసులో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు, శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించాలని, ఫిర్యాదులు చేయకుండానే ప్రత్యర్థి పార్టీ నేతల్ని అరెస్టు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల సమావేశాలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా, జూదం, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడానికి వీలు లేదని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధూప, దీప నైవేద్యం.. జగనాధీనం
[ 23-04-2024]
దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తీసుకోవడమేకానీ.. ఇవ్వడం తెలియదన్నట్లుగా.. ఆలయాల నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో జమ చేసుకున్నారుగాని.. తిరిగి పైసా విదిల్చ లేదు. -
ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’
[ 23-04-2024]
ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ వినోద్కుమార్ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటించారు. -
ఊపందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 37 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో అనంత లోక్సభకు 7 ఎనిమిది, అసెంబ్లీ స్థానాలకు 30 సెట్ల ప్రకారం నామినేషన్లు వచ్చాయి. -
పదిలో 24వ స్థానం
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 24వ స్థానానికి పరిమితమైంది. 80.93 శాతం ఉత్తీర్ణత సాధించినా జిల్లాల వారీగా పరిశీలిస్తే చివరన ఉంది. -
గ్రానైట్ పరిశ్రమలపై గునపం
[ 23-04-2024]
చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం. -
ఆస్తి పాస్తులు
[ 23-04-2024]
అభ్యర్థి: కాలవ శ్రీనివాసులు -
తోయండి.. ఇది జగన్మొండి
[ 23-04-2024]
వైకాపా ఐదేళ్ల నిర్లక్ష్య పాలన.. ఉరవకొండ ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి కారణంగా తరచూ బస్సులు నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు వస్తున్న పల్లె వెలుగు బస్సు పట్టణంలోని ప్రధాన రహదారిపై డిపో సమీపంలో గేర్లు పడక ఆగిపోయింది. -
బోధించడం పాపమా.. గురువులపై క్రూరత్వమా?
[ 23-04-2024]
నవ సమాజ నిర్మాతలు గురువులు.. ఎందుకో జగన్కు వీరంటేనే గిట్టదు. తనకు విద్యాబుద్ధులు నేర్పిందీ ఒక గురువే అన్న జ్ఞానాన్ని విస్మరించి.. వారిని శత్రువుల్లా చూస్తూ దండెత్తుతున్నాడు. -
‘అనంత’కు కలిసిరాని నాయకగణం
[ 23-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు. -
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 23-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిందని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భర్తీలో వెనుకబాటు.. పాలన నగుబాటు
[ 23-04-2024]
విద్యుత్తు శాఖ సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. -
పదో తరగతి ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. కళ్యాణదుర్గం మండలంలో 69.12శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 27మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. -
ధర్మవరంలో వైకాపాకు ఝలక్
[ 23-04-2024]
ధర్మవరం నియోజకవర్గంలో వైకాపాలో బీసీ నాయకులుగా మెలిగిన వారు ఆ పార్టీకే ఝలక్ ఇస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో విభేదాలున్న నాయకులు ఒక్కొక్కొరు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
తెదేపాతో అర్హులందరికీ సంక్షేమం: సునీత
[ 23-04-2024]
తెదేపాలో చేరిన వారు భయపడాల్సిన పనిలేదు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా