శేషజీవితంలోనూ కన్నీరే
నాలుగు దశాబ్దాలకుపైగా ప్రజా సేవకు అంకితమయ్యారు.. ప్రభుత్వ సేవ నుంచి పదవీ విరమణ పొంది విశ్రాంతి తీసుకుంటున్నారు.
పింఛన్దారులపై కరుణ ఏదీ?
జిల్లా సచివాలయం, కళ్యాణదుర్గం గ్రామీణం, తాడిపత్రి, కదిరి, న్యూస్టుడే: నాలుగు దశాబ్దాలకుపైగా ప్రజా సేవకు అంకితమయ్యారు.. ప్రభుత్వ సేవ నుంచి పదవీ విరమణ పొంది విశ్రాంతి తీసుకుంటున్నారు. శేష జీవితాన్ని హాయిగా.. ఆనందంగా గడపాల్సిన విశ్రాంత ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. సకాలంలో పెన్షన్ సొమ్ము అందక అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా 18 ఖజానా ఉప కార్యాలయాల పరిధిలో 38 వేల మంది ప్రభుత్వ పెన్షన్దారులు ఉన్నారు. వీరందరూ పెన్షన్ సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆరు మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో పెన్షన్ చెల్లించడం లేదు. ఈ నెల ఎనిమిది రోజులు గడిచినా సొమ్ము అందలేదు. వీరిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపడం లేదు.
దీర్ఘకాలిక జబ్బులతో సతమతం
వయసు మీదపడే కొద్దీ అనేక రకాల దీర్ఘకాలిక జబ్బులు వేధిస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు(బీపీ), పక్షవాతం, కీళ్లనొప్పులు, అసిడిటీ, గ్యాస్ట్రిక్, కండరాల నొప్పి, తల తిరగడం, మెడనొప్పి.. ఇలా పలు రుగ్మతలు వెంటాడుతాయి. నిత్యం మందులు వాడితేనే ఉపశమనం కలుగుతుంది. మరోవైపు శస్త్ర చికిత్సలు, ఇంటి అద్దె, సరకులు, ఈఎంఐ (కంతులు) చెల్లింపులకూ ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రతి నెలా ఎదురుచూపులే
పింఛను సొమ్ము కోసం ప్రతి నెలా ఎదురుచూడాల్సి వస్తోంది. సకాలంలో అద్దె, బ్యాంకు రుణ కంతులు చెల్లించలేకపోతున్నాం. అప్పులు చేసి నిత్యావసర సరకులు కొనాల్సి వస్తోంది. విశ్రాంత ఉద్యోగులంతా నిత్యం ఆరా తీస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న మాలాంటి పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ప్రభుత్వం స్పందించి ఒకటో తేదీన సొమ్ము ఇవ్వాలి.
- లక్ష్మీనారాయణరెడ్డి, నియోజకవర్గ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు, తాడిపత్రి
పింఛన్ సొమ్మే ఆధారం
నా భర్త నారాయణప్ప పశుసంవర్ధక శాఖలో లైవ్స్టాక్ అసిస్టెంట్గా పని చేస్తూ మరణించారు. ఆయన ద్వారా వస్తున్న పింఛన్ మొత్తంతోనే కుటుంబం ఆధారపడ్డాం. నెలకు రూ.20 వేలు పెన్షన్ వస్తోంది. నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. నెలకు రూ.8 వేలు ఔషధాల కోసం ఖర్చు చేస్తున్నా. కుమారుడు, కుమార్తె చదువులు, కుటుంబ పోషణ కష్టమైంది. పింఛన్ సొమ్ము సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. జీవనం కష్టంగా మారుతోంది.
- రామకృష్ణమ్మ, కోటవీధి, కళ్యాణదుర్గం
ఔషధాలు కొనలేని దుస్థితి
నేను కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ 2009లో పదవీ విరమణ పొందా. నెలకు రూ.17 వేలు పెన్షన్ వస్తోంది. ఈనెల ఇప్పటికీ రాలేదు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నా. నా కాలుకు ఆపరేషన్ జరిగింది. ఛాతి నొప్పికి చికిత్స చేయించుకుంటున్నా. నాకు, నా భార్యకు కలిపి నెలకు రూ.6 వేల వరకు మాత్రలకు ఖర్చు చేస్తున్నా. పింఛన్ సొమ్ము అందక మందులు కొనుగోలు చేయలేకపోతున్నా. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
- రషీద్, రెవెన్యూ కాలనీ, కళ్యాణదుర్గం
రోడ్డెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయి
ఉద్యోగ విరమణతో విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన సమయంలో పింఛను సొమ్ముకు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రతినెలా వారం, పదిరోజులు దాటందే జమ కావటం లేదు. ఈ పరిస్థితి ఏడాదిగా నెలకొంది. మాకు బయట అప్పులు ఇవ్వరు. పింఛనుపై తీసుకున్న బ్యాంకు రుణ కంతులు ఆలస్యంతో రూ.వేలల్లో అపరాధ రుసుం కట్టాల్సి వస్తోంది. విశ్రాంత ఉద్యోగులపై ప్రభుత్వానికి కనికరం లేదు.
- ఆత్మారెడ్డి, విశ్రాంత ఉద్యోగి, కదిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు