logo

అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రిలో చోటు చేసుకుంది.

Published : 09 Dec 2022 06:20 IST

భాస్కర్‌ (పాత చిత్రం)

తాడిమర్రి, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రిలో చోటు చేసుకుంది. గురువారం ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి తూర్పు చెరువు కట్ట సమీపంలోని ఎస్సీ కాలనీకి చెందిన తగిలే భాస్కర్‌ (35) అనే రైతుకు మండలంలోని పెద్దకోట్ల గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. మూడేళ్లుగా వేరుసెనగ పంట సాగు చేస్తుండేవారు. ఏటా అప్పు చేసి పంట సాగు చేస్తున్నా దిగుబడి రాక నష్టాలు వచ్చేవి. దీనికితోడు కుటుంబ పోషణకు డ్వాక్రా, ఆర్డీటీ పొదుపు సంఘాల్లో రూ.రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్నారు. బ్యాంకులో తీసుకున్న క్రాప్‌లోన్‌ ఎక్కువ కావడంతో వడ్డీ కూడా చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భాస్కర్‌కు మోక్షిత, శ్రావిక, చర్విత అనే ముగ్గురు ఆడపిల్లలున్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని