తాను మరణిస్తూ.. మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి తాను మరణిస్తూ.. మరో ముగ్గురికి ఉపయోగపడేలా అవయవదానం చేశారు.
నారాయణస్వామి
అనంతపురం(వైద్యం), న్యూస్టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి తాను మరణిస్తూ.. మరో ముగ్గురికి ఉపయోగపడేలా అవయవదానం చేశారు. వివరాలు.. పామిడి మండలం పాళ్యం గ్రామానికి చెందిన నారాయణస్వామి (59) సోమవారం రోడ్డు ప్రమాదానికి గురవడంతో స్థానికులు చికిత్స కోసం నగరంలోని కిమ్స్ సవీర ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కృషి చేశారు. దురదృష్టవశాత్తు బుధవారం ఆయన బ్రెయిడ్ డెడ్కు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి సమన్వయకర్తలు అవగాహన కల్పించడంతో వారు ఒప్పుకున్నారు. మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపడానికి అవయవాలు ఉపయోగపడతాయని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. నారాయణస్వామి మూత్రపిండాలు, కాలేయం తీసుకుని, జీవన్దాన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ఛానెల్ ద్వారా గురువారం బెంగళూరు విమానాశ్రయానికి తీసుకెళ్లి, అక్కడి నుంచి వాయుమార్గంలో విశాఖపట్నం తరలించారు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటుకు సహకరించిన అనంతపురం, కర్ణాటక పోలీసులను జీవన్దాన్ అభిందనలు తెలియజేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!