వైరల్గా మారిన బాలిక పెళ్లి వీడియో
బాలికకు ప్రేమికుడు తాళి కట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇందుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ఇలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికతో స్థానిక యువకుడు కొంతకాలం ప్రేమాయణం నడిపాడు.
విచారణ చేపట్టిన ఐసీడీఎస్ అధికారులు
ఉరవకొండ, న్యూస్టుడే: బాలికకు ప్రేమికుడు తాళి కట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇందుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ఇలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికతో స్థానిక యువకుడు కొంతకాలం ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొందరు గ్రామస్థులు యువకుడిని నిలదీయడంతో రెండురోజుల క్రితం బాలికకు ఇంటివద్దే అందరూ చూస్తుండగా తాళికట్టాడు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు గురువారం గ్రామంలో విచారణ జరిపారు. మైనర్ను వివాహం చేసుకున్న యువకుడిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని బాలిక తల్లిదండ్రులకు సూచించారు. చైల్డ్లైన్కు కూడా ఫిర్యాదు చేశారు. బాలిక చదువు కొనసాగించేలా కేజీబీవీలో ప్రవేశం కల్పించడానికి చర్యలు చేపడతామని సీడీపీఓ డాక్టరు శ్రీదేవి చెప్పారు.
ప్రభోదానంద కేసులో తెదేపా కౌన్సిలర్ అరెస్టు
తాడిపత్రి, న్యూస్టుడే: తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ గ్రామంలో 2018 సంవత్సరంలో గ్రామస్థులు, ప్రభోదానంద భక్తులు పరస్పరం దాడులు చేసుకున్న కేసులో అరెస్టుల పరంపర ఇంకా కొనసాగుతోంది. నాలుగు సంవత్సరాల కాలంలో ఇప్పటికే వందల సంఖ్యలో జేసీ అనుచరులైన తెదేపా నాయకులను అరెస్టు చేసి రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పురపాలక 26వ వార్డు తెదేపా కౌన్సిలర్ షేక్షావలిపై ప్రభోదానంద కేసుకు సంబంధించి హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసులు నమోదు చేసి రిమాండుకు పంపినట్లు పోలీసులు చెప్పారు.
ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ హత్యకు కుట్ర కేసులో నలుగురిపై కేసు
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ హత్యకు కుట్రపన్నిన కేసులో అతని భార్య నాగమణి, ప్రణాళిక రచించిన ఖమ్మంకు చెందిన నిజాముద్దీన్ అలియాస్ స్వామీజీ, మరో ఇద్దరిపై అనంతపురం టూటౌన్లో గురువారం కేసు నమోదైంది. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో నమోదైన గుప్తనిధుల కేసులో ప్రధాన నిందితుడు నిజాముద్దీన్ను అక్కడి పోలీసులు విచారించే క్రమంలో ప్రకాష్ హత్యకుట్ర కోణం బయటపడింది. అక్కడి పోలీసులు కేసును అనంతపురం టూటౌన్కు బదిలీ చేశారు. టూటౌన్ పోలీసులు నాగమణితో పాటు నిజాముద్దీన్ను గురువారం విచారించినట్లు తెలిసింది. ‘తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండటం, డిస్మిస్ అయిన తర్వాత వేధింపులకు గురి చేయడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె విచారణలో వెల్లడించినట్లు సమాచారం. మూడు నెలలుగా హత్యకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో స్వామీజీ నిజాముద్దీన్తో హత్య విషయమై చర్చించింది. రెండు నెలల క్రితం అతను క్షుద్రపూజలు చేశాడు. ఫలితం లేకపోవడంతో విషమిచ్చి హతమార్చాలని పన్నాగం పన్నారు. ఈ నెల 1న కానిస్టేబుల్ ప్రకాష్ అనంతపురంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసనకు దిగడంతో అదే రోజు పోలీసులు రిమాండుకు పంపారు. జైలు నుంచి రాగానే చంపాలని పథకం రచించారు. ఇందుకు శ్రీనివాస్, రామ్రాజ్ అనే వ్యక్తులకు సుపారీ ఇచ్చినట్లు తెలిసింది. ఇంతలో గుప్తనిధుల కేసులో అరెస్టు కావడంతో కుట్ర బహిర్గతమైంది. ఈ కేసులో పైనలుగురిని అరెస్టు చేసి గురువారం రిమాండ్కు పంపినట్లు టూటౌన్ సీఐ శివరాముడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు