వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు తథ్యం
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో బాలకృష్ణ
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఊరేగింపుగా వస్తూ..
హిందూపురం అర్బన్ న్యూస్టుడే: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా గురువారం హిందూపురానికి వచ్చిన ఆయన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. సాయంత్రం పట్టణంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నమార్కెట్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన మెయిన్ బజార్ మీదుగా సాగగా ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కూడలిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి పాలన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తారని, దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో పరిశ్రమల స్థాపన లేదని ఆరోపించారు. గతంలో ఎన్టీఆర్ ఈ ప్రాంతానికి పారిశ్రామికవాడ తీసుకొచ్చారని, చంద్రబాబు ముందుచూపుతో కియా పరిశ్రమ తీసుకొచ్చారని గుర్తు చేశారు. నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న హిందూపురానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తెచ్చి పట్టణంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని వివరించారు. పార్టీ నాయకులు జేపీకే రాము, డీఈ రమేష్కుమార్, రాఘవేంద్ర, చంద్రమోహన్, శివకుమార్, జయసింహ, నబిరసూల్ తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షి మండలం గలిబిపల్లిలో రహదారి పనులు ప్రారంభిస్తున్న బాలయ్య
కళ్లుండి చూడలేని ప్రభుత్వమిది
లేపాక్షి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం కళ్లుండి చూడలేని.. చెవులుండి వినలేని ధీనస్థితిలో ఉందని ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడా బీటీ రహదారుల నిర్మాణాలు చేపట్టలేదని, కనీసం గుంతలను మట్టితో పూడ్చలేదన్నారు. లేపాక్షి మండలంలోని గలిబిపల్లికి వెళ్లే రహదారి నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే భూమిపూజ చేసి స్వయంగా పొక్లెయిన్ను నడిపి అభిమానులు, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని రహదారులన్నీ పూర్తి చేయాలనే తలంపుతో రూ.40 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. అప్పట్లో గలిబిపల్లి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నిధులు రూ.35 లక్షలతో రహదారిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ జయప్ప, మాజీ ఎంపీపీ ఆనంద్కుమార్, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు