అభివృద్ధిలో జిల్లాను అగ్ర పథాన నిలుపుదాం
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో జిల్లాను అభివృద్ధిలో అగ్ర పథాన నిలుపుదామని కలెక్టర్ బసంత్కుమార్ పిలుపునిచ్చారు.
అట్టహాసంగా సాగిన గణతంత్ర వేడుకలు
ప్రసంగిస్తున్న కలెక్టర్ బసంత్కుమార్
పుట్టపర్తి గ్రామీణం, న్యూస్టుడే: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో జిల్లాను అభివృద్ధిలో అగ్ర పథాన నిలుపుదామని కలెక్టర్ బసంత్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం సిరసాని హిల్స్ పోలీసు పరేడ్ మైదానంలో 74వ గణతంత్ర దిన వేడుకలను జిల్లా అధికారులు అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు వాహనంలో ఎస్పీ రాహుల్దేవ్సింగ్తో కలిసి పరేడ్ మైదానంలో సైనిక వందనం స్వీకరించారు. భారతదేశ స్వాతంత్య్రం, రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిన ఎంతోమంది మహనీయుల త్యాగాలు, వారి సేవలను మననం చేసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి జాతీయ పతాకానికి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన ప్రగతి నివేదికను సభలో చదివి వినిపించారు. జిల్లాలో 2.69 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రెండు విడతలుగా రూ.308 కోట్లు ఇచ్చామని, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లీనిక్ల రాకతో గ్రామస్వరాజ్య స్థాపన జరిగిందన్నారు. ఉచిత పంటల బీమా కింద 2159 మంది రైతులకు రూ.10.70 కోట్లు, సున్నా వడ్డీకింద 1,29,291 మందికి రూ.25.43 కోట్లు, స్వయంసహాయక సంఘం సభ్యులకు రెండు విడతలుగా 46,653 మందికి రూ.361.17 కోట్లు వారి ఖాతాలకు జమ చేశామన్నారు. అమ్మఒడి కింద ఈ విద్యా సంవత్సరం 1,66,441 మంది తల్లుల ఖాతాలకు రూ.249.66 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 5054 నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో రూ.16,456 కోట్లతో 48 భారీ, మెగా పరిశ్రమలు స్థాపించామని ఈ ఏడాది జులై నాటికి రూ.14.22 కోట్ల పెట్టుబడితో 132 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన, సింగిల్ డెస్క్ పోర్టల్ పథకం కింద 3039 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, ఆయా పరిశ్రమల్లో జిల్లా వ్యాప్తంగా 34,314 మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు. కార్యక్రమంలో జేసీ చేతన్, ఆర్డీవో భాగ్యరేఖ, ఏఎస్పీ రామకృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం కేజీబీవీ విద్యార్థినుల నృత్యం
చూడ చక్కని తల్లి.. చుక్కల్లో జాబిల్లి
పరేడ్ మైదానంలో విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని ధర్మవరం కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థులు, ధర్మవరం లలితకళానికేతన్ బృందం నిర్వహించిన సంప్రదాయ, జానపద నృత్యాలు ఆహుతులను మంత్ర ముగ్దులను చేశాయి. స్వాతంత్య్ర సమరయోధుల వీరోచిత పోరాటాలు, దేశభక్తి గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. బుక్కపట్నం డైట్ కళాశాల బాలికలు నిర్వహించిన ‘చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి.. నవ్వుల్లో నాగమల్లి నాపల్లె పాలవెల్లి’ జానపద గీతానికి విద్యార్థులు చేసిన నృత్యృం మైమరపించింది. చిన్నారులు వందేమాతర గీతం అందరి హృదయాల్లో దేశ భక్తిని నింపింది. డైట్ విద్యార్థులను కలెక్టర్ ప్రశంశించారు. డీఈవో మీనాక్షి, ఎంఈలు వెంకటరమణనాయక్, గోపాల్నాయక్ నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
చిన్నారి నృత్యాభినయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు