భూ మాఫియాదే రాజ్యం
‘రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధి భూతద్దం వేసి వెతికినా కానరాలేదు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ధ్వజం
కలెక్టరేట్ ఎదుట 30 గంటల సత్యాగ్రహ దీక్ష
సంఘీభావం తెలుపుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, నేతలు
అనంతపురం(శ్రీనివాస్నగర్), న్యూస్టుడే: ‘రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధి భూతద్దం వేసి వెతికినా కానరాలేదు. ఇప్పుడు భూ మాఫియాదే రాజ్యం. ఎక్కడ చూసినా భూ కబ్జాలే నడుస్తున్నాయి. ప్రభుత్వ భూములే కాదు... పేదల భూములు సైతం దౌర్జన్యంగా, అక్రమంగా లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారంతో వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. జగన్ సర్కార్కు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఇళ్లు, ఇళ్లపట్టాల సాధన కోసం ‘30 గంటలు సత్యాగ్రహం’ దీక్ష చేపట్టారు. ఈ నిరసనకు సంఘీభావం ప్రకటించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్దలు, పేదల మధ్య పోరు సాగుతోందని సీఎం అంటున్నారు. ఇదే నిజమైతే రాష్ట్రంలో పేదలకు ఎందుకు ఇళ్లు కట్టించలేదు. ఇంటి పట్టాలు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ఈ ఒక్క జిల్లాలోనే అదాని వంటి పెద్దలకు 42వేల ఎకరాల భూమిని కట్టబెట్టారు. పేదలకు 42 గజాల స్థలం ఇవ్వలేరా అని నిలదీశారు. వైకాపా నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములన్నీ ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. పేదల భూములను సైతం దౌర్జన్యంగా లాక్కుంటున్నారని విమర్శించారు. సమస్యల కోసం ఉద్యమిస్తే వలంటీర్లు సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారు. ఈ వ్యవస్థ పేదలను పీడిస్తోందని ధ్వజమెత్తారు. అదాని కోసమే భాజపా సర్కార్ పని చేస్తోందని ఆరోపించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండు చేశారు. దీక్షా శిబిరంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, నాగేంద్రకుమార్, బాలరంగయ్య, సావిత్రి, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, చంద్రశేఖర్రెడ్డి తదితరులు మాట్లాడారు. మధ్యాహ్నం అక్కడే వంటా వార్పు నిర్వహించారు. సీపీఎం కీలక నేతలందరూ నడిరోడ్డుపై భోజనం చేశారు. బుధవారం రాత్రి దీక్షా శిబిరంలోనే నిద్రించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
[ 18-04-2024]
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
సాగు పడిపోయింది జగన్.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం
[ 18-04-2024]
అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
[ 18-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. -
తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి
[ 18-04-2024]
ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. -
19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ
[ 18-04-2024]
ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
[ 18-04-2024]
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్ అగర్వాల్ జిల్లాకు చేరుకున్నారు. -
నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం
[ 18-04-2024]
కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. -
‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం
[ 18-04-2024]
-
మడకశిరలో వైకాపాకు షాక్
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. -
కల్యాణ వైభోగమే..
[ 18-04-2024]
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. -
కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
[ 18-04-2024]
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. -
అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!
[ 18-04-2024]
మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. -
ధర్మవరంలో కూటమి జోరు
[ 18-04-2024]
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. -
నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన్
[ 18-04-2024]
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గురువారం నామపత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి