రైతుల సొమ్ము స్వాహా
ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఒక ఏఈ తన తెలివితేటలను ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు.
బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి ట్రాన్స్కో ఏఈ బాగోతం
అనంత (విద్యుత్తు), న్యూస్టుడే: ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఒక ఏఈ తన తెలివితేటలను ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన మొత్తాన్ని నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి తన ఖాతాలోకి జమ చేసుకున్నాడు. తమ పరిహారం అందకపోవటంతో ఎందుకు విడుదల చేయడం లేదని రైతులు ట్రాన్స్కో ఉన్నతాధికారులను ప్రశ్నించటంతో అధికారులు ఆరాతీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు సంబంధించిన ట్రాన్స్కో ప్రధాన కార్యాలయం అనంతపురంలోని బళ్లారిరోడ్డులో ఉంది. ఇందులో టీఎల్సీ విభాగంలో పనిచేసే ఓ ఏఈ నిధులు నొక్కేశాడు.
రూ.25 లక్షలకు పైగా ..
ఉమ్మడి జిల్లా పరిధిలో భానుకోట నుంచి హిందూపురం వరకు 220 కేవీ విద్యుత్తు లైన్ను 60 కిలోమీటర్లు ట్రాన్స్కో ఏర్పాటు చేస్తోంది. ఈ లైన్కు సంబంధించి రమారమి 330 నుంచి 350 మీటర్ల మేర ఒక టవర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. రైతుల భూముల్లో ఒక్కో టవర్ (ఫోర్లెగ్స్) ఏర్పాటు చేస్తే రూ.99 వేలు పరిహారం అందజేస్తారు. అలాగే భూమిలో ఏదైనా పంట సాగుచేసి ఉంటే అందులో టవర్ ఏర్పాటుకు అయ్యే భూమి వివరాల ప్రకారం వ్యవసాయ అధికారుల నివేదికకు అనుగుణంగా నష్టపరిహారం ఇస్తారు. నేరుగా కర్షకుల పేర్ల మీదనే పరిహారం మొత్తం చెక్కుల రూపంలోనే అందజేస్తుంది. వాటిని రైతులు తమకు ఖాతాలున్న బ్యాంకుల్లో అందజేస్తే బ్యాంకు అధికారులు పరిశీలించి నిధులు జమ చేస్తారు. అయితే సదరు ఏఈ రైతుల పేర్లమీద వచ్చిన చెక్కులను తన ఖాతాలోకి మళ్లించుకుని వాడుకున్న విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఏఈ ఒక్కడే ఉన్నాడా, లేక బ్యాంకు ఉద్యోగుల సహకారం ఉందా అనే అంశాలపై ట్రాన్స్కో అధికారులు ఆరా తీస్తున్నారు. విషయాన్ని బయటకు పొక్కకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సదరు ఏఈ విధుల్లో చేరినప్పటి నుంచి తన సహచర ఉద్యోగులతో కొంత మొత్తం అప్పు తీసుకోవటం, తిరిగి చెల్లించకపోవటంతో చెడ్డపేరు తెచ్చుకున్నాడు. రూ.15 లక్షలపైగా అప్పులు చేసినట్లు ట్రాన్స్కో ఉద్యోగులు తెలుపుతున్నారు.
అంతా గోప్యత..
రూ.25 లక్షలకు పైగా స్వాహా చేసినా ట్రాన్స్కో అధికారులు మాత్రం గోప్యత పాటించటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా.. వాటిని వెలుగులోకి రాకుండా కొంతమంది అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏఈ వ్యవహారంపై అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల కన్స్ట్రక్షన్ ఎస్ఈ రామకృష్ణ, అనంతపురం ట్రాన్స్కో టీఎల్సీ విభాగం డీఈఈ ఉమమాహేశ్వర్ దృష్టికి ‘న్యూస్టుడే’ తీసుకెళ్లగా సమాచారం ఇచ్చే అధికారం తమకులేదని తెలిపారు. కార్యాలయ విషయాలను వెల్లడించలేమని పేర్కొనటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అçËకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నామపత్రాల్లో అభ్యర్థుల ఆస్తిపాస్తులు
[ 19-04-2024]
నామినేషన్ మొదలైన తొలిరోజు పలు పార్టీల అభ్యర్థులు వారి ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను నామపత్రాల్లో దాఖలు పర్చారు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు