logo

ఇంటి ముందు నీళ్లు పోస్తున్నారని ఘర్షణ

ఇంటి ముందు నీళ్లు పోస్తున్నారనే విషయమై ఇరు కుటుంబాలు గొడవపడ్డారు. అందులో ఒకరు అస్వస్థతకు గురై మృతిచెందారు.

Published : 02 Feb 2023 05:24 IST

అస్వస్థతకు గురై ఒకరి మృతి

సోమరవాండ్లపల్లి (కనగానపల్లి), న్యూస్‌టుడే : ఇంటి ముందు నీళ్లు పోస్తున్నారనే విషయమై ఇరు కుటుంబాలు గొడవపడ్డారు. అందులో ఒకరు అస్వస్థతకు గురై మృతిచెందారు. ఈ ఘటన కనగానపల్లి మండలంలోని సోమరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరాములు(60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన లక్ష్మన్న కుటుంబ సభ్యులు శ్రీరాములు ఇంటి ముందు రోజూ నీళ్లు పోస్తున్నారని రెండు కుటుంబాలు గొడవపడ్డారు. ఒకరినొకరు వాదించుకునే క్రమంలో శ్రీరాములు అస్వస్థతకు గురై నేలవాలాడు. చికిత్స నిమిత్తం రామగిరి మండలంలోని ఎగువపల్లికి తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంలో వెళుతూ ఒక్కసారిగా రక్తపోటు అధికమై కింద పడ్డాడు. ఆటోలో ధర్మవరానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని