logo

యువకుడి దుర్మరణం

మండలంలోని పేరూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని శంకర్‌(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు.

Published : 03 Feb 2023 06:09 IST

శంకర్‌ (పాతచిత్రం)

రామగిరి, కంబదూరు, న్యూస్‌టుడే: మండలంలోని పేరూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని శంకర్‌(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. రామగిరి పోలీసుల వివరాల మేరకు.. కంబదూరు మండలం రాళ్లఅనంతపురం గ్రామానికి చెందిన శంకర్‌ బుధవారం రాత్రి తన మేనత్త ఊరు తగరకుంటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. పేరూరు చెక్‌పోస్టు సమీపంలో మలుపు వద్ద రహదారి పక్కనున్న గోతిలో గురువారం మృతదేహం వెలుగు చూసింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతోనే తమ కుమారుడు మృతిచెందినట్లు తండ్రి ఓబుళపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శంకర్‌ బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేసేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని