వైకాపా నుంచి యాదవ సంఘం నాయకుడి సస్పెన్షన్
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న నెపంతో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లి మాజీ సర్పంచి, అఖిల భారత యాదవ సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసప్పను వైకాపా నుంచి సస్పెండ్ చేశారు.
లక్ష్మీనరసప్ప
గోరంట్ల, న్యూస్టుడే: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న నెపంతో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లి మాజీ సర్పంచి, అఖిల భారత యాదవ సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసప్పను వైకాపా నుంచి సస్పెండ్ చేశారు. ఆ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ చర్యలు తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రయాదవ్ మధ్య విభేదాల నేపథ్యంలో.. రామచంద్రయాదవ్ ఆస్తులను గతంలో వైకాపా వారు ధ్వంసం చేశారు. ఈ చర్యను ఖండిస్తూ లక్ష్మీనరసప్ప నాటి సమావేశంలో ఘాటుగా విమర్శించారు. రామచంద్రయాదవ్ ఇటీవల జిల్లాలో తన సామాజిక వర్గానికి చెందిన తెదేపా నాయకుల ఇళ్లకు వచ్చారు. ఆ సమయంలో లక్ష్మీనరసప్ప కూడా పాల్గొన్నారు.
‘బీసీలపై దాడిగా పరిగణిస్తాం’
పెనుకొండ పట్టణం, న్యూస్టుడే: గోరంట్ల మండలం వెంకటరమణపల్లికి చెందిన లక్ష్మినరసప్పను వైకాపా నుంచి సస్పెండ్ చేయడం బీసీలపై చేస్తున్న దాడిగా పరిగణిస్తామని బీసీ సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములుయాదవ్ పేర్కొన్నారు. గురువారం ఆయన పెనుకొండలో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే శంకరనారాయణ కొమ్ముకాస్తున్నారని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన పార్టీకి ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు చేశారో తెలియజేయకుండా తొలగించిన తీరు హాస్యాస్పదమన్నారు. శంకరనారాయణ బీసీల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి పెద్దిరెడ్డికి ఎందుకు తొత్తుగా మారుతున్నావని ప్రశ్నించారు. బీసీలు మీకు సరైన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.