తహసీల్దార్ కార్యాలయాల్లో గుడిసెలు వేస్తాం
‘నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వడానికి తహసీల్దార్లు చిన్నచూపు చూస్తున్నారు. అదే వైకాపా నేతలు అడిగిందే తడువు ఆగమేఘాలపై కబ్జా భూములకు ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు.
30 గంటల సత్యాగ్రహ దీక్ష విరమణ
మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ‘నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వడానికి తహసీల్దార్లు చిన్నచూపు చూస్తున్నారు. అదే వైకాపా నేతలు అడిగిందే తడువు ఆగమేఘాలపై కబ్జా భూములకు ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు. ఈనెల 8లోపు ఇంటి పట్టాలు, స్థలాలు ఇవ్వకపోతే తహసీల్దారు కార్యాలయాల్లోనే గుడిసెలు వేయిస్తాం’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో అనంత కలెక్టరేట్ ఎదుట చేపట్టిన 30 గంటల సత్యాగ్రహ దీక్ష గురువారం ముగిసింది. రాంభూపాల్ మాట్లాడుతూ ఎంతో కాలంగా అనేక రూపాల్లో నిరసన తెలుపుతున్నా రెవెన్యూ యంత్రాంగం ఏమాత్రం స్పందించలేదని విమర్శించారు. జిల్లాలో 68వేల ఇళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు తప్ప ఏమీ ఒరగలేదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ ఇంటి పట్టాలు, స్థలాల కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనన్నారు. సత్యాగ్రహ దీక్షకు స్పందించిన ఆర్డీఓ మధుసూదన్ శిబిరానికి వచ్చారు. పేదల నుంచి అర్జీలు తీసుకున్నారు. వారంలోపు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిరసనలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప, శ్రీనివాసులు, నాగేంద్రకుమార్, బాలరంగయ్య, సావిత్రి, కృష్ణమూర్తి, తరిమెల నాగరాజు, శివకుమార్, రామిరెడ్డి, ఆర్వీ నాయుడు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యచంద్రయాదవ్, ప్రధాన కార్యదర్శి పరమేష్, డీవైఎఫ్ఐ కార్యదర్శి నరసింహారెడ్డి, ముస్కీన్వలి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా