logo

మట్టి తరలింపులో గప్‌చుప్‌

జిల్లాలోని ఇద్దరు ప్రజాప్రతినిధులు ముఖ్య అనుచురుడు హిందూపురం ప్రాంతంలో మట్టి తరలింపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఎవరికీ మట్టి కావాలన్న అ నాయకుడు సరఫరా చేయాల్సిందే.

Published : 03 Feb 2023 06:09 IST

పట్టుకున్న వాహనాలు ఇవే

హిందూపురం, న్యూస్‌టుడే: జిల్లాలోని ఇద్దరు ప్రజాప్రతినిధులు ముఖ్య అనుచురుడు హిందూపురం ప్రాంతంలో మట్టి తరలింపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఎవరికీ మట్టి కావాలన్న అ నాయకుడు సరఫరా చేయాల్సిందే. ఎవరైనా ఎద్దుల బండిలో మట్టి తీసుకొచ్చిన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఆ నాయకుడు పొక్లెయిన్లర్లు, టిప్పర్లును ఏర్పాటు చేసుకుని మట్టి దందా సాగిస్తున్నాడు. ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడంతో గనులశాఖ విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రెండు రోజులు కిందట వారు హిందూపురం ప్రాంతంలో దాడులు నిర్వహించారు. మలుగూరు వద్ద రెండు పొక్లెయిన్లు, రెండు టిప్పర్లు పట్టుకున్నారు. అ వాహనాలను హిందూపురం గ్రామీణ మండలం పోలీసులకు అప్పగించారు. వాహనాలు సీజ్‌ చేసిన విషయం తెలిసిన వెంటనే ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ఆ విషయం బయటకు వెళ్లడించరాదంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. వాహనాలు పట్టుబడినా అధికారులు ఇప్పటి దాకా సమాచారం బయటపెట్టలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని