నిధుల కొరతంటూ.. యాత్రకు సై అంటూ..!
‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’ అన్న సామెత అనంతపురం నగరపాలక సంస్థకు సరిగ్గా సరిపోతుంది.
అనంత నగరపాలక తీరు
గ్లౌజులు, బూట్లు లేకుండానే పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు
ఈనాడు డిజిటల్, అనంతపురం న్యూస్టుడే, నగరపాలక: ‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’ అన్న సామెత అనంతపురం నగరపాలక సంస్థకు సరిగ్గా సరిపోతుంది. పారిశుద్ధ్య కార్మికులకు వస్తుసామగ్రి అందించలేని అధికారులు స్టడీ టూర్ పేరిట కార్పొరేటర్లను యాత్రకు తీసుకెళ్తున్నారు. చీపుర్లు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో యాత్రకు రూ.33 లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మొత్తాన్ని సాధారణ నిధుల్ని వినియోగించాలని నిర్ణయించారు. ఇండోర్, దిల్లీ, ఆగ్రా నగర పాలకసంస్థల్లో ఘనవ్యర్థాల నిర్వహణ పరిశీలించేందుకు కార్పొరేటర్లను తీసుకెళ్తున్నట్లు చెబుతున్నట్లు. పాలకవర్గంతోపాటు అధికారులు కలిపి మొత్తం 64 మంది వెళ్లనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలికవసతుల కల్పనకు నిధులు కొరతని చెబుతూ వస్తున్న అధికారులు ‘స్టడీ టూర్’ పేరుతో పెద్దమొత్తంలో ఖర్చు చేస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది.
12 నుంచి 16 వరకు..
ఇండోర్, దిల్లీ, ఆగ్రా నగరాల్లో ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు యాత్ర జరగనుంది. బెంగళూరు వెళ్లి.. విమానంలో అదే రోజు సాయంత్రం ఇండోర్ చేరుకుంటారు. అక్కడ ఫోర్స్టార్ హోటల్లో బస చేయనున్నారు. 14న దిల్లీ చేరుకుని అక్కడి నగరపాలక సంస్థను పరిశీలించనున్నారు. 15న ఆగ్రాలో పర్యటిస్తారు. 16న బెంగళూరుకు విమానంలో చేరుకుంటారు. 50 మంది కార్పొరేటర్లు, 5 మంది కోఅప్షన్ సభ్యులు, 9 మంది అధికారులు, సిబ్బంది యాత్రకు వెళ్లనున్నారు. ఒక్కొక్కరికీ రూ.52,777 ఖర్చు చేయనున్నారు.ఇందుకు సంబంధించి హైదరాబాద్కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ టెండరు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నగర జనాభా 3.31 లక్షలు. పది లక్షలలోపు జనాభా కలిగి ఉన్న వాటిలో తిరుపతి ఉంది. స్వచ్ఛత ర్యాంకుల్లో దేశంలోనే మొదటి స్థానం సంపాదించింది. ఈ నేపథ్యంలో తిరుపతి నగరపాలక సంస్థ తీరును పరిశీలించి సహకారం పొందవచ్చు. ఇలా చేస్తే నిధులు మిగిలి ఇతర వాటికి వినియోగించడానికి అవకాశాలు ఉంటాయి.
కేటాయింపు రూ.50 లక్షలే...
నగరంలో 450 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు 2021-22లో రూ.50 లక్షలు కేటాయించారు. తమకు అవసరమైన సామగ్రి అందించడం లేదని కార్మికులు ఇటీవల ధర్నా చేశారు. రెండేళ్లుగా భద్రతా పరికరాలు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. దీంతో కార్మిక సంఘాల నాయకులతో అధికారులు రెండు రోజుల కిందట సమావేశమై మార్చిలో పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పరిస్థితి ఇలా ఉండగా.. కార్పొరేటర్ల యాత్రకు రూ.33 లక్షలు సాధారణ నిధుల నుంచి ఖర్చు చేస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కార్మికులు చేతికి గ్లౌజులు, కాళ్లకు బూట్లు లేకుండానే పారిశుద్ధ్య పనులు చేయాల్సి వస్తోంది. యాత్ర కోసం ఖర్చు చేసే నిధుల్ని నగరంలో దెబ్బతిన్న రహదారులను మరమతు ఇతరత్రా కనీస అవసరాలకు వినియోగిస్తే ఉపయోగకరంగా ఉంటుందని నగరవాసులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ