జాతీయ ప్రతిభా పరీక్షలకు పోటీ
నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఈ నెల 5న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
5న ఉమ్మడి జిల్లాలో పరీక్షలు
ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ వరకూ ఉపకారవేతనం
అనంతపురం విద్య, పుట్టపర్తి గ్రామీణ, కొత్తచెరువు, న్యూస్టుడే: నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఈ నెల 5న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జిల్లాల పునర్విభజన జరిగినా ఇంత వరకూ ప్రభుత్వ పరీక్షలన్నీ ఉమ్మడిగానే నిర్వహించారు. జాతీయ ప్రతిభా ఉపకారవేతన పరీక్షలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 11 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. 2,596 మంది విద్యార్థులు అనంత జిల్లా నుంచి ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకూ ఏటా రూ.12వేలు ఉపకారవేతనం లభిస్తుంది. అయితే విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల్లో ఉండకూడదు. ఉపకార వేతనానికి ఎంపికైన తరువాత కూడా ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాల్సి ఉంటుంది.
వెబ్సైట్లో హాల్టికెట్లు
ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఉపాధ్యాయులు పాఠశాల యూడైస్ కోడ్ను ఉపయోగించి పాఠశాల లాగిన్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఒక్కనిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
ఎన్ఎంఎంఎస్ పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తాం. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. చరవాణి, ఎలక్ట్రికల్ పరికరాలు అనుమతించం. ఓఎంఆర్షీట్లో సమాధానాలు నింపాల్సి ఉంటుంది. హాల్టికెట్లు, పెన్నులు విద్యార్థులు తీసుకొని పరీక్షకు రావాలి.
గోవిందనాయక్, పరీక్షల విభాగం సహాయ సంచాలకులు, అనంతపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.