నిర్లక్ష్యం.. చేనేత కార్మికులకు శాపం
అధునాతన శిక్షణ, చీరలపై డిజైన్లు, నేత పనిలో మెలకువలు ఇచ్చేందుకు చేనేత-జౌళి శాఖ ఆధ్వర్యంలో హిందూపురంలో ఏర్పాటు చేసిన తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణ కేంద్రం అలంకారప్రాయంగా మారింది.
అలంకారప్రాయంగా శిక్షణ కేంద్రం
నిరుపయోగంగా మగ్గాలు
హిందూపురం అర్బన్, న్యూస్టుడే: అధునాతన శిక్షణ, చీరలపై డిజైన్లు, నేత పనిలో మెలకువలు ఇచ్చేందుకు చేనేత-జౌళి శాఖ ఆధ్వర్యంలో హిందూపురంలో ఏర్పాటు చేసిన తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. ఈ కేంద్రంలో పనిచేసే సిబ్బంది కొన్నేళ్లుగా కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు. విలువైన యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. పలు రకాలుగా ఉపయోగించుకొనే అవకాశం ఉన్నా పట్టించుకొనే నాథుడు లేదు.
* చేనేత కార్మికుల బహుళ ప్రయోజనాలు ఆశించి 1987లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం, స్థానిక ఎమ్మెల్యే ఎన్టీఆర్ హిందూపురంలో తొలుత గుడ్డం రంగనాథస్వామి దేవాలయం సమీపంలో 2.17 ఎకరాల విస్తీర్ణంలో తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణ కేంద్ర ఏర్పాటు చేశారు. తరవాత తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలోనూ మరో కేంద్రం ఏర్పాటైంది. చేనేత జౌళి శాఖ అధికారుల ద్వారా ప్రతి జిల్లా నుంచి ఇద్దరు చొప్పున నేత కార్మికులను ఎంపిక చేసి వసతి కల్పించారు. వారికి రెండు నెలలు శిక్షణ భృతి రూ.1,200 అందించి పనిలో మెలకువలు, టవళ్లు, బెడ్షీట్లు, శిల్క్చీరలు, జాకాడ్ ద్వారా చీరలు ఎలా అల్లాలో శిక్షణ ఇచ్చేవారు. దీని కోసం అప్పట్లో లక్షలు వెచ్చించి కేంద్రంలో వర్క్షెడ్, అద్దకపు విభాగం, తరగతి గది, వసతిగృహ సముదాయం, గ్రంథాలయం సౌకర్యం ఏర్పాటు చేశారు.
కనీస స్థాయిలో పని లేదు
ఈ కేంద్రంలో సహాయ సంచాలకులు, సాంకేతిక సిబ్బంది మొత్తం పది మందిలో ప్రస్తుతం అయిదుగురు మాత్రమే ఉన్నారు. వీరికి కనీస స్థాయిలో పనిలేదు. మహిళలకు కుట్టు, చేతి వృత్తులు, పట్టు అలంకారాలు, గృహోపకరణాల తయారీపై శిక్షణ ఇస్తే కేంద్రం సద్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకొంటే కొంతైనా ప్రయోజనం ఉంటుందని, లేదంటే కాలగర్భంలో కలిసే అవకాశాలు లేకపోలేదని పలువురు చెబుతున్నారు.
స్పందన కరవు..
ప్రారంభంలో శిక్షణ పొందేందుకు ఎక్కువ మంది చేనేత కార్మికులు ఆసక్తి చూపేవారు. ఐదేళ్లు నుంచి ముందుకు రావటం లేదు. శిక్షణ కాలంలో రోజుకు రూ.40 చొప్పున భృతి, చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు రావటంతో కనీస స్థాయిలో శిక్షణ పొందేందుకు ముందుకు రావడంలేదు. శిక్షణ భృతి రెండు నెలలకు రూ.6 వేలకు పెంచితే కార్మికులు వచ్చే అవకాశం ఉందని ప్రతిపాదించి ఏళ్లు గడుస్తున్నా.. దీనిపై ప్రభుతం స్పందన లేదు. ప్రభుత్వం నిధులు కేటాయించక నిర్లక్ష్యానికి గురై కేంద్రం భవనాలు శిథిలావస్థకు చేరుకొన్నాయి.
భృతి పెంచాలని ప్రతిపాదనలు చేశాం
భృతి తక్కువగా ఉన్నందును శిక్షణ పొందేందుకు చేనేత కార్మికులు ముందుకు రావటంలేదు. ఈ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. సమగ్ర నైపుణ్యాభివృద్ధి పథకం తీసుకొస్తే మరికొంత మందికి ఈ కేంద్రం ఉపయోగపడే అవకాశం ఉన్నందున ఈ విషయాన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.
మైసూరు నాగేశ్వరరావు, ప్రిన్సిపల్, శిక్షణ కేంద్రం, చేనేత- జౌళి శాఖ సహాయ సంచాలకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగు పడిపోయింది జగన్.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం
[ 18-04-2024]
అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
[ 18-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. -
తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి
[ 18-04-2024]
ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. -
19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ
[ 18-04-2024]
ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
[ 18-04-2024]
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్ అగర్వాల్ జిల్లాకు చేరుకున్నారు. -
నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం
[ 18-04-2024]
కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. -
‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం
[ 18-04-2024]
-
మడకశిరలో వైకాపాకు షాక్
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. -
కల్యాణ వైభోగమే..
[ 18-04-2024]
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. -
కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
[ 18-04-2024]
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. -
అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!
[ 18-04-2024]
మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. -
ధర్మవరంలో కూటమి జోరు
[ 18-04-2024]
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. -
నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన్
[ 18-04-2024]
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గురువారం నామపత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..