logo

‘జగన్‌ నియంత పాలనకు చరమ గీతం పాడదాం’

వచ్చే ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా ముఖ్యమంత్రి జగన్‌ నియంత పాలనకు చరమగీతం పాడదామని తెదేపా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.వచ్చే ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా ముఖ్యమంత్రి జగన్‌ నియంత పాలనకు చరమగీతం పాడదామని తెదేపా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.

Published : 05 Feb 2023 04:29 IST

పందిపర్తిలో ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో బీకే పార్థసారథి తదితరులు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా ముఖ్యమంత్రి జగన్‌ నియంత పాలనకు చరమగీతం పాడదామని తెదేపా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలసి శనివారం మండలంలోని పందిపర్తి, మంచేపల్లి గ్రామాల్లో ఇదేం ఖర్మ..మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటా తిరిగి..ప్రస్తుతం ప్రభుత్వ పాలన, ఇబ్బందుల గురించి తెలుసుకొన్నారు. వైకాపా పాలన పట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సర్పంచులు విసిగిపోతున్నారని పేర్కొన్నారు. వైకాపా నాయకుల ఆగడాలకు ఎమ్మెల్యే శంకరనారాయణ వంత పాడుతూ..కక్షలకు మరింత ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. నాయకులు భానుకీర్తి, చంద్రశేఖర్‌, సంజీవరెడ్డి, రామకృష్ణ, భానుమూర్తి, శ్రీనివాసరెడ్డి, ఆదిమూర్తి, నారాయణప్ప, క్రిష్టప్ప, అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు.        

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు