బామ్మపై బాధ్యత భారం
కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన రామక్కకు కొడుకు రవి ఏకైక సంతానం. రవికి భార్య రాధ, ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు.
మునిమనవళ్లతో రామక్క
గాయపరిచిందని గతాన్ని.. కలిసిరావట్లేదని కాలాన్ని నిందించలేదామె.
తనపనితాను చేసుకోలేని వయస్సులోనూ.. బంధాల బాధ్యతను మరచిపోలేదు.
ప్రస్తుత స్వార్థపూరిత సమాజంలో.. రక్త సంబంధాలను పట్టించుకోని కాలంలోనూ.. అమ్మానాన్నలేని ఇద్దరు మునిమనవళ్ల ఆలనాపాలనను భుజానికెత్తుకుంది.
తనకు మోయలేని భారమైనా.. శరీరం సహకరించకపోయినా.. వృద్ధాప్య బడలికనూ లెక్కచేయకుండా ఇళ్లలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది.
కదిరి పట్టణం: కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన రామక్కకు కొడుకు రవి ఏకైక సంతానం. రవికి భార్య రాధ, ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు. కుమార్తె (రామక్క మనవరాలు) మహేశ్వరిని ఆరేళ్ల కిందట తలుపుల మండలం చిన్నపల్లికి చెందిన సోమశేఖర్కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఐదేళ్ల మోహిత్, మూడేళ్ల వరుణ్ సంతానం. సంతోషంగా సాగిపోతున్న మహేశ్వరి, సోమశేఖర్ దాంపత్యం అర్ధాంతరంగా ఆగిపోయింది. అనారోగ్యం బారినపడిన ఈ దంపతులిద్దరూ ఒకరివెంట ఒకరు మృత్యువాతపడ్డారు. సోమశేఖర్ నాలుగునెలల కిందట మరణించగా.. మహేశ్వరి రెండునెలల కిందట కన్నుమూసింది. ఊహ తెలియని చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. ఇద్దరు మనవళ్లను వారి తాత రవి కటారుపల్లికి తీసుకొచ్చారు. కానీ, రవి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు రవి పరిస్థితిని కళ్లారా చూస్తున్న రామక్క మునిమనవళ్ల పోషణ బాధ్యతను తీసుకుంది. ఇళ్లలో పనిచేస్తూ ఇద్దరు చిన్నారులను పోషిస్తోంది. తన ప్రాణం ఉన్నంతవరకు వారికి ఏలోటూ రానివ్వనని, అయితే తానెంతకాలం బతుకుతానో తెలియదని, తన తర్వాత చిన్నారుల పరిస్థితేంటని కుమిలిపోతోంది. ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తన మునిమనవళ్లను ఆదుకోవాలని వేడుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు