జాతీయస్థాయి క్రీడలు ఉన్నట్టా.. లేనట్టా..!
జాతీయస్థాయి క్రీడాపోటీల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా పరీక్షలకు ముందే క్రీడా పోటీల నిర్వహణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.
బడ్జెట్ విడుదల చేయని ప్రభుత్వం
అసోసియేషన్ల ఆధిపత్య పోరుతో విద్యార్థులకు నష్టం
జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో తలపడుతున్న విద్యార్థులు (పాత చిత్రం)
పుట్టపర్తి గ్రామీణం, న్యూస్టుడే: జాతీయస్థాయి క్రీడాపోటీల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా పరీక్షలకు ముందే క్రీడా పోటీల నిర్వహణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నేటికీ రాష్ట్రస్థాయి పోటీలే పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో జాతీయస్థాయి క్రీడల పోటీలు ఉన్నట్టా లేనట్టా అన్న సందిగ్ధత నెలకొంది. క్రీడా బడ్జెట్ లేదు.. సామగ్రి లేదు, జాతీయస్థాయి క్రీడా పోటీల ప్రణాళిక షెడ్యూల్ విడుదల కాకపోయినా ఈ ఏడాది ఏపీ రాష్ట్ర క్రీడా పాఠశాలల సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) క్రీడా పోటీలను చేపట్టింది.
ఆర్థిక కష్టాలు
ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీల నిర్వహణ వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆర్థిక కష్టాలను తెచ్చి పెట్టింది. క్రీడా పోటీలు తప్పనిసరని ప్రభుత్వం ఆదేశించడంతో సొంత నిధులు, దాతల ఆర్థిక సాయంతో మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయిల్లో పోటీలు నిర్వహించారు. సరిపడా క్రీడా సామగ్రి లేకపోయినా... కొన్నిచోట్ల మైదానాలు బాగుంటే, మరికొన్నిచోట్ల అసలే లేకపోవడం, ఉన్నచోట ఆడుకోవడానికి అనువుగాలేక విద్యార్థులకు తప్పని అవస్థలు. రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లేందుకు రవాణా ఛార్జీలు, దుప్పట్లు, తదితర వస్తువులు క్రీడాకారులే వెంట తెచ్చుకోవాలని ఎస్జీఎఫ్ సూచించడంతో.. ఆర్థిక స్థోమతలేని విద్యార్థులు ఆడేందుకు ముందుకు రాని పరిస్థితి. రైల్వేశాఖ హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు రూ.75 రాయితీతో అందించే రవాణా సదుపాయాన్ని రద్దు చేసింది. ఒక్కొక్కరికి సాధారణ టిక్కెట్పై వెళ్లాలన్నా రూ.600 కావాలి. క్రీడల నిర్వహణకు విస్తరాకుల నుంచి తాగునీటి వరకు రూ.వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కో ఈవెంట్కు 800 మంది దాకా క్రీడాకారులు వస్తారు. వీరికి అయ్యే ఖర్చు భారమే. దీంతో ఆడాలన్న ఆసక్తి ఉన్నా పేద విద్యార్థులు ఆర్థిక భారంతో వెనకడుగు వేసే దుస్థితి. దాతల సహకారంతో ఇంతవరకు నెట్టుకు రాగిలిగారు.
కొన్నింటికే పరిమితం
ఎస్జీఎఫ్ఐ పరిధిలో 86 రకాల ఆటలుంటే 46కే కుదించారు. జిల్లాలో 46 క్రీడలకుగాను 30 క్రీడా పోటీలను పూర్తి చేశారు. ఇంకా 16 క్రీడలను ఈనెల ఆఖరులోపు పూర్తి చేయాలని సీఎస్సీ ఆదేశించింది. స్కూల్గేమ్స్లో 16 రకాలైన బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, హ్యాండ్బాల్, రగ్బీ, స్విమ్మింగ్, బాక్సింగ్, రైఫిల్ షూటింగ్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ టెన్నిస్బాల్ వంటి ఆటలకు నేరుగా జిల్లాస్థాయి పోటీలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
‘క్రీడా క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నుంచి సెప్టెంబరులోపు జిల్లాస్థాయి ఆటల పోటీలు పూర్తి చేసి.. నవంబరు, డిసెంబరులో ఇంటర్ డిస్ట్రిక్ట్, జనవరి, ఫిబ్రవరి లోపు జాతీయ స్థాయి క్రీడా పోటీలను పూర్తి చేయాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఫిబ్రవరి మొదలైనా ఇంకా ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలే పూర్తి కాలేదు. మార్చి నుంచి పరీక్షల కాలం. ఈ నేపథ్యంలో జాతీయస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం సాధ్యపడదు. ఆరా తీస్తే ఈ పోటీలు లేనట్టేనని తెలుస్తోంది’
ఉమ్మడి అనంత జిల్లాలో ఉన్నత పాఠశాలలు: 661
విద్యార్థులు: 2.40 లక్షలు, ఆడాల్సిన మొత్తం క్రీడలు: 86
ఆడిస్తున్నది: 46, పూర్తయిన క్రీడలు: 46
ఇంకా నిర్వహించాల్సినవి: 16
జాతీయ స్థాయికి ఎంపికనవారు: 69 మంది
రెండు, మూడు కార్యవర్గాల ఏర్పాటుతో..
అసోసియేషన్ల ఏర్పాటుకు ఎలాంటి ఎన్నికలు లేనందున ఎవరికివారు రెండు, మూడు కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుని పాతుకుపోయారు. మరో కార్యవర్గం ఏర్పాటుతో వివాదానికి దారితీసింది. డబ్బులు ఉన్నవాళ్లు అసోసియేషన్ల ఏర్పాటుకు ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో కార్యవర్గం ఐదు ఈవెంట్స్ని నిర్వహించాలి. క్రీడాకారులను పెంచాలి. ఒక్కో ఈవెంట్కి రూ.3 లక్షల వ్యయం చేయాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల జారీ ఎవరు చేయాలి, ఎవరికి చెల్లుబాటు చేసే అధికారం ఉందన్న దానిపై అసోసియేషన్లు కోర్టు మెట్లెక్కాయని, ఆ కారణంగా ఈఏడు జాతీయస్థాయి క్రీడా పోటీలు ఉండవని ఇప్పటికీ విడుదల కాని షెడ్యూలే అందుకు నిదర్శనం. దీంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి. క్రీడా కోటాలో ఉద్యోగాలు, ఉన్నత విద్యలో రిజర్వేషన్లు, ప్రోత్సాహకాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
ఎంపిక ప్రక్రియ జరుగుతోంది
జాతీయస్థాయి క్రీడా పోటీలకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికి 46 క్రీడలకుగాను 30 పూర్తి చేశాం. ఇంకా 16 ఈనెల లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి జాతీయస్థాయి క్రీడా పోటీలకు 69 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కోర్టులో కేసు నడుస్తోంది. జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఉండక పోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం నిర్వహిస్తామంటే అందుకు సిద్ధంగా ఉన్నాం.
అంజన్న, ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ