logo

అన్నివర్గాలకు స్వేచ్ఛ: మంత్రి జయరాం

అన్నివర్గాలకు స్వేచ్ఛ కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.

Published : 06 Feb 2023 03:44 IST

నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి జయరాం, జడ్పీఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ తదితరులు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: అన్నివర్గాలకు స్వేచ్ఛ కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కదిరి అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ నూతన భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు ద్వారా పోలీస్‌స్టేషన్‌, పాఠశాల, గ్రామసచివాలయాల్లో సౌకర్యాలను సమకూరుస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం తమకులేదన్నారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రకు స్పందన లేదన్నారు. ఎంపీ గోరంట్లమాధవ్‌, ఎమ్మెల్యేలు సిద్దారెడ్డి, శంకర్‌నారాయణ, జడ్పీఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌, ఆర్డీవో రాఘవేంద్ర, అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌, డీఎస్పీ భవ్యకిషోర్‌, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని