నేర వార్తలు
మండలంలోని డి.చెర్లోపల్లికి చెందిన కిషన్చౌదరి (23) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. బంధువుల వివరాల మేరకు.. డి.చెర్లోపల్లికి చెందిన చల్లా రంగనాయుడు ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటున్నారు.
ఉద్యోగసాధనకు సన్నద్ధమవుతూ.. ఆకస్మిక మృతి
కిషన్ చౌదరి (పాత చిత్రం)
బత్తలపల్లి, న్యూస్టుడే : మండలంలోని డి.చెర్లోపల్లికి చెందిన కిషన్చౌదరి (23) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. బంధువుల వివరాల మేరకు.. డి.చెర్లోపల్లికి చెందిన చల్లా రంగనాయుడు ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటున్నారు. ఆయన పెద్ద కుమారుడు కిషన్చౌదరి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ సాధనలో భాగంగా శిక్షణ తీసుకోవడానికిగాను బెంగళూరు వెళ్లడానికి సన్నద్ధమయ్యాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండె నొప్పితో బాధపడుతుండగా చూసిన పెంచుకున్న కుక్క అరవడంతో కుటుంబ సభ్యులు లేచి చూశారు. వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు. చిన్నవయసులో మృతి చెందడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గ్రామ వాలంటీరు బలవన్మరణం
నవీన్కుమార్ (పాత చిత్రం)
బ్రహ్మసముద్రం, న్యూస్టుడే: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని మనస్తాపం చెంది గ్రామ వాలంటీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మండల కేంద్రం బ్రహ్మసముద్రంలో చోటుచేసుకుంది. బ్రహ్మసముద్రానికి చెందిన నవీన్కుమార్ (34) స్థానిక సచివాలయం పరిధిలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఇతడికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా భార్య తరచూ భర్తతో, అత్తమామలతో గొడవ పడుతుండేది. ఇరవై రోజుల క్రితం భార్య హర్షిత పుట్టింటికి వెళ్లింది. పలుమార్లు పిలిచినా పుట్టింటి నుంచి తిరిగి రాలేదని తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమీపంలోనే ఉంటున్న తల్లిదండ్రులు సోమవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి చూడగా నవీన్కుమార్ ఉరి వేసుకుని మృతిచెందినట్లు గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి గిరిమల్లప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి పంచనామా కోసం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తేనెటీగల దాడిలో అయిదుగురు విద్యార్థులకు గాయాలు
అబ్దుల్ రహిమాన్కు చికిత్స చేస్తూ...
గోరంట్ల, న్యూస్టుడే: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై సోమవారం సాయంత్రం తేనెటీగలు దాడిచేసి కుట్టాయి. ఈ ఘటనలో అబ్దుల్ రహిమాన్, షాహిద్, మరో విద్యార్థి, ఉపాధ్యాయుడు గోపాల్తోపాటు ఆటో చోదకుడు ఫక్రుద్దీన్ గాయపడ్డారు. ఫక్రుద్దీన్ తన ఆటోలో విద్యార్థి అబ్దుల్ రహిమాన్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యాధికారి వినోద్కుమార్ ఆధ్వర్యంలో చికిత్స అందించి.. 108 వాహనంలో హిందూపురం పంపించారు. విద్యార్థి శరీరం నుంచి వందకుపైగా ముళ్లు తొలగించినట్లు డాక్టర్ చెప్పారు. అదే సమయంలో అక్కడే పదోతరగతి విద్యార్థులకు స్టడీఅవర్స్ జరుగుతున్నాయి. ఉపాధ్యాయుడు గోపాల్ అప్రమత్తమై విద్యార్థులందరిని తరగతి గతిలోకి తీసుకెళ్లి తలుపులు వేయడంతో వారు దాడి నుంచి బయటపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు