ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
అనంతపురం నగరంలో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలపై దాడి చేశారు.
కళాశాల పైఅంతస్తు నుంచి దూకి అఘాయిత్యం కళాశాలలో అద్దాలు ధ్వంసం చేస్తున్న సంఘం నాయకుడు
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: అనంతపురం నగరంలో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలపై దాడి చేశారు. వన్టౌన్ సీఐ రవిశంకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కదిరి పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని అనంతపురం నగరంలో మేనత్త ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం యథాప్రకారం కళాశాలకు వెళ్లినా.. తరగతులకు హాజరుకాలేదు. 11 గంటల ప్రాంతంలో కళాశాల పైఅంతస్తు నుంచి దూకింది. ఈ ప్రమాదంలో విద్యార్థినికి నడుము విరగడంతో తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల సిబ్బంది హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వన్టౌన్ సీఐ రవిశంకర్రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని ఆరా తీశారు. విద్యార్థిని బ్యాగులో రాసి పెట్టుకున్న ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల తల్లి బెంగళూరులో, తండ్రి ఆగ్రాలో ఉంటున్నారు. వీరి మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు లేఖలో పేర్కొనట్లు సమాచారం. తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఒక్కోచోట ఉంటున్నారని, ఈ విషయమై తరచూ స్నేహితురాళ్లతో వాపోయేదని తెలిసింది. కాగా కళాశాలలో రికార్డులకు సంబంధించిన ఫీజు రూ.12 వేలు చెల్లించాల్సి ఉందని విద్యార్థిని ఆసుపత్రిలో తెలపడం గమనార్హం.
విద్యార్థి సంఘాల దాడి: విషయం తెలుసుకున్న ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. యాజమాన్యం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహంతో కుర్చీలు, టేబుళ్లను విసిరికొట్టారు. నీళ్ల క్యాన్లతో ఆఫీసు ఛాంబర్ అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషనుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు