గాడి తప్పిన పాలన
ధర్మవరం నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో డీఎస్పీ, తహసీల్దారు, సెబ్ సీఐ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి నెలలు గడిచినా నేటికీ కొత్త వారిని ఆయా స్థానాల్లో నియమించలేదు.
కీలక స్థానాల్లో అధికారుల్లేరు..
ధర్మవరం తహసీల్దారు కార్యాలయం
ధర్మవరం, న్యూస్టుడే : ధర్మవరం నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లతో డీఎస్పీ, తహసీల్దారు, సెబ్ సీఐ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి నెలలు గడిచినా నేటికీ కొత్త వారిని ఆయా స్థానాల్లో నియమించలేదు. ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉన్నా తను చెప్పిందే జరగాలనే ఆ ప్రజాప్రతినిధి తీరు కారణంగా అధికారులుగా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా నెలల తరబడి ఇన్ఛార్జి పాలనే కొనసాగుతుండటంతో మూడు శాఖల్లో పరిపాలన గాడి తప్పింది.
ప్రజలకు తప్పని తిప్పలు
ధర్మవరం తహసీల్దారు నీలకంఠారెడ్డి రెండు నెలల క్రితం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇన్ఛార్జిగా బత్తలపల్లి తహసీల్దారు యుగేశ్వరిదేవి కొనసాగుతున్నారు. రెండు చోట్ల విధులు నిర్వహించాల్సి ఉండడంతో పనిభారం పడుతోంది. రెగ్యులర్ తహసీల్దార్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు కుల, ఆదాయ, ఈడబ్ల్యూఎస్, తదితర ధ్రువీకరణ పత్రాలు సమయానికి తీసుకోలేకపోతున్నారు. రైతులు వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చి పనులు జరగకపోవడంతో వెనుదిరుగుతున్నారు.
పర్యవేక్షణ అంతంతే..
పోలీసు శాఖను పర్యవేక్షించాల్సిన డీఎస్పీ స్థాయి అధికారి పోస్టు 3 నెలలుగా ఖాళీగా ఉంది. డీఎస్పీగా ఉన్న రమాకాంత్ గత ఏడాది నవంబరులో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. పెనుకొండ డీఎస్పీ హుస్సేన్ పీరా ధర్మవరం ఇన్ఛార్జి ఉన్నారు. రెండు డివిజన్లను నెలల తరబడి పర్యవేక్షిస్తుండటంతో ఆయనకు పని భారంగా మారింది. ధర్మవరం సబ్డివిజన్లో 5 సర్కిళ్లు ఉన్నాయి. ధర్మవరం వన్టౌన్, ధర్మవరం టూటౌన్, బత్తలపల్లి, ముదిగుబ్బ, రామగిరి సర్కిళ్లు సబ్ డివిజన్లో ఉన్నాయి. పది పోలీసుస్టేషన్లు డీఎస్పీ పరిధిలో ఉన్నాయి. ముదిగుబ్బ సర్కిల్ పరిధిలో ముదిగుబ్బ, తాడిమర్రి, పట్నం ఠాణాలు ఉన్నాయి. బత్తలపల్లి సర్కిల్ పరిధిలో ధర్మవరం గ్రామీణ, బత్తలపల్లి స్టేషన్లు ఉన్నాయి. ధర్మవరం 1వ పట్టణ, 2వ పట్టణ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. సమస్యాత్మక, ఫ్యాక్షన్ గ్రామాలు.. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో ఉన్నాయి.
* ధర్మవరం సెబ్ సీఐ సైదులు 2 నెలల క్రితం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. పెనుకొండ సెబ్ సీఐ శ్రీధర్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ధర్మవరం సెబ్ స్టేషన్ పరిధిలో ధర్మవరం పట్టణంతోపాటు గ్రామీణ, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలు ఉన్నాయి. రెగ్యులర్ సెబ్ సీఐ లేకపోవడంతో కర్ణాటక నుంచి అక్రమ మద్యం ధర్మవరం, ముదిగుబ్బ ప్రాంతాలకు రవాణా సాగుతోంది. ముదిగుబ్బ మండలంలో కర్ణాటక మద్యంతోపాటు నాటుసారా విక్రయాలు జోరందుకున్నాయి. సెబ్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్నా అడ్డదారుల్లో కర్ణాటక నుంచి ధర్మవరం నియోజకవర్గానికి మద్యం వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్