దస్త్రాల్లో లెక్కలు.. ఎండిపోయిన మొక్కలు!
రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపు కోసం అవెన్యూ ప్లాంటేషన్ కింద రూ.లక్షలు ఖర్చుచేసి మొక్కలు నాటారు. నిర్వహణ లోపం కారణంగా అవి ఎండిపోవటంతో ప్రజాధనం వృథాగా మారింది.
బిల్లులు రాక.. నిర్వహణ భారం..
కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్టుడే: రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపు కోసం అవెన్యూ ప్లాంటేషన్ కింద రూ.లక్షలు ఖర్చుచేసి మొక్కలు నాటారు. నిర్వహణ లోపం కారణంగా అవి ఎండిపోవటంతో ప్రజాధనం వృథాగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆదిలోనే మొక్కలన్నీ ఎండిపోయాయి. సకాలంలో బిల్లులు అందకపోవడంతో వాటి సంరక్షణ గాలికొదిలేశారు. దీంతో మొక్కలు ఎండిపోయి కనుమరుగయ్యాయి. అధికారుల దస్త్రాల్లో లెక్కలు మాత్రం ఉండగా, నాటి మొక్కలు క్షేత్రస్థాయిలో సక్రమంగా లేకపోవడం గమనార్హం. రెండు సంవత్సరాల నుంచి మొక్కల సంరక్షణకు సంబంధించిన బిల్లులు రావడం లేదని అధికారులే స్పష్టం చేస్తున్నారు.
కిలోమీటరుకు 400 మొక్కలు నాటారు. ఒక్కో గుంత తీసేందుకు రూ.50 నుంచి రూ.60 వంతున, మొక్క నాటినప్పటి నుంచి వాటి సంరక్షణకు ఒక్కో మొక్కకు రూ.16 వంతున ప్రభుత్వం సంరక్షకులకు అందజేయాల్సి ఉంది. 2021-22 ఏడాదికి సంబంధించి అవెన్యూ ప్లాంటేషన్కు సంబంధించిన బిల్లులు రాలేదు. జిల్లా వ్యాప్తంగా 2.15.761 మొక్కలు నాటగా ఇప్పటివరకు సంరక్షణకు పది నెలల బిల్లుల కింద రూ.1,88,38,100 రావాల్సి ఉంది.
* 2020-21, 2021-22 సంవత్సరాల్లో కడియం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి పలు రకాల మొక్కలు తీసుకొచ్చింది. ఒక్కో మొక్కకు రూ.98 ధర వెచ్చింది. వీటి సంరక్షణ కోసం ఒక్కో మొక్కకు రూ.16 వంతున చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ బిల్లులు అందిన దాఖలాలు లేవు. దీంతో చాలాచోట్ల మొక్కలకు నీరందించలేక పోతున్నారు. రోడ్డు పక్క ఉన్న మొక్కలు ఎండిపోయాయి. ఇలాంటి వాటికి సంరక్షణ బిల్లులు ఏ విధంగా ఇస్తారోననే సందేహం వ్యక్తమవుతోంది.
కళ్యాణదుర్గం ప్రాంతంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఏవీ?
* కళ్యాణదుర్గం మండలంలోని ఓ గ్రామానికి చెందిన సంరక్షకుడిని అడుగగా ఏడాదిగా మొక్కలకు నీరు పోసినా ఇప్పటివరకు రూపాయి బిల్లులు రాలేదన్నారు. ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా వస్తాయని చెబుతుండటంతో ఇప్పటికీ మొక్కలకు నీటిని పోస్తున్నానని చెప్పారు. వేసవిలో వాటిని సంరక్షించటం మరింత కష్టమవుతుందని, బిల్లులు రాకపోటంతో జీవనం కష్టమైందని వాపోతున్నారు.
ప్రతిపాదనలు పంపాం
- వేణుగోపాల్రెడ్డి, డ్వామా పీడీ
అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటించాం. ఇతర రాష్ట్రాల నుంచి మొక్కలు తెప్పించి ఖర్చు చేశాం. వాటిని రోడ్డుకు ఇరువైపులా నాటించాం. వాటి సంరక్షకులకు ఏడాది కాలంగా రూ.1.88 కోట్లకు బిల్లులు రావాల్సి ఉంది. ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం. నిధులు మంజూరైన వెంటనే అందజేస్తాం. త్వరలోనే సమస్య పరిస్కారం అవుతుంది. మొక్కలు చనిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.