logo

భార్యను హత్యచేసిన భర్త

కారు కొనిపెట్టాలంటూ భార్యను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించిన భర్త సోమవారం అర్ధరాత్రి ఆమెను హతమార్చాడని పోలీసులు తెలిపారు.

Published : 08 Feb 2023 06:18 IST

భార్యతో ఖాజా (పాత చిత్రం)

గుత్తి, న్యూస్‌టుడే: కారు కొనిపెట్టాలంటూ భార్యను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించిన భర్త సోమవారం అర్ధరాత్రి ఆమెను హతమార్చాడని పోలీసులు తెలిపారు. గుత్తిలోని మారుతీనగర్‌లో ఉంటున్న ఖాజాకు నంద్యాల జిల్లా డోన్‌ మండలం, నక్కవాగుపల్లికి చెందిన జుబేదాబీతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. ఇతడు వృత్తిరీత్యా కారుడ్రైవర్‌. తనకు సొంతంగా కారు కావాలని, పుట్టింటి నుంచి డబ్బు తెమ్మని కొంతకాలంగా వేధిస్తున్నాడు. మద్యానికి బానిసైన ఖాజా ఆమెను శారీరకంగా వేధిస్తూ నిత్యం గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో అతడు సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆమె గొంతునులిమి హత్య చేశాడు. పైగా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు గొంతుకు చీర బిగించి ఇంటిలో వేలాడదీశాడు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మంగళవారం గుత్తికి వచ్చి కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అల్లుడే తమ కుమార్తెను హత్యచేసినట్లు జుబేదాబీ తండ్రి నన్నేసాహెబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకట్రామిరెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని