నేర వార్తలు
ఒంటరితనంతో తాగుడుకు బానిసైన ఓ వాలంటీరు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన హర్షవర్ధన్రెడ్డి (28) వార్డు వాలంటీరుగా పనిచేస్తున్నాడు.
వాలంటీరు బలవన్మరణం
గుత్తి, న్యూస్టుడే: ఒంటరితనంతో తాగుడుకు బానిసైన ఓ వాలంటీరు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన హర్షవర్ధన్రెడ్డి (28) వార్డు వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఈయనకు తల్లిదండ్రులు లేరు. ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు. ఒంటరితనాన్ని తాళలేక ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం అయినా అతడు భోజనానికి రాకపోవడంతో చిన్నాన్నకు అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా శవమై కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో పడి చేనేత కార్మికుడు..
ధర్మవరం: పట్టణంలోని లక్ష్మీనగర్కు చెందిన పుట్లూరు నారాయణ (38) అనే చేనేత కార్మికుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈనెల 5 నుంచి బయటకు వెళ్లిన నారాయణ మంగళవారం ధర్మవరం చెరువులో మృతదేహమై తేలారు. స్థానికులు గమనించి 1వ పట్టణ పోలీసులకు తెలపడంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. చేనేతమగ్గం నేస్తూ చీరల వ్యాపారం నిర్వహిస్తూ నారాయణ కుటుంబాన్ని పోషించుకునేవాడని స్థానికులు తెలిపారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతుండేవారని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. నారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రైల్లో నుంచి పడి యువకుడి మృతి
గుత్తి, న్యూస్టుడే: వేగంగా వెళుతున్న రైల్లో నుంచి కిందపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గుత్తి మండలం, కొజ్జేపల్లికి చెందిన హనుమంతు కుమారుడు రవితేజ (28) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ల కోసం సోమవారం అనంతపురంలోని ఎస్కేయూకు వచ్చాడు. సర్టిఫికెట్లతో హైదరాబాద్కు రాత్రి రైల్లో వెళుతూ ప్రమాదవశాత్తూ గుత్తి శివారులో పడిపోయాడు. తీవ్ర గాయాలవటంతో ప్రాణాలు కోల్పోయాడు. రైల్లో సీట్లు లేక బోగీ వాకిలి వద్ద కూర్చున్న రవితేజ రైలు కుదుపులకు పట్టుతప్పి కిందపడిపోయి ఉండవచ్చునని రైల్వే పోలీసులు చెప్పారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ..
లేపాక్షి: మండలంలోని వీబూదిపల్లికి చెందిన గంగాదేవి (38) నీటికుంట వద్దనున్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకపోవడంతో భర్త సత్యనారాయణ, కుటుంబ సభ్యులు చుట్టపక్కల గాలించారు. ఆమె ఆచూకీ తెలియలేదు. మంగళవారం ఉదయం ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై షర్ఫుద్దీన్ తెలిపారు.
పాత కేసులో ఎర్రచందనం దొంగల అరెస్టు
తాడిపత్రి, న్యూస్టుడే: పాత కేసుల్లో నిందితులుగా ఉన్న ఎర్రచందనం దొంగలను అరెస్టు చేసినట్లు గ్రామీణ సీఐ చిన్నపెద్దయ్య చెప్పారు. 2018 సంవత్సరంలో తాడిపత్రి మండలం బుగ్గ సమీపంలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తూ పోలీసుల కంటపడగానే పరారైన కేసులో నిందితులుగా ఉన్న తమిళనాడు చెందిన శరావన్ మరో ఎనిమిది మంది, బెంగుళూరు చెందిన ఒకరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున కొండాపురం గ్రామం వద్ద ప్రధాన రహదారిలో పుట్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న పది మంది ఎర్రచందనం కూలీలేనని సీఐ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్