జీతాల జాడేదీ..!
ప్రతి నెలా మాదిరే... ఈసారి వేతన జీవులు నిరీక్షిస్తున్నారు. జీతం ఎప్పుడు వస్తుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ వారం రోజులుగా ఆత్రుతతో ఆరాటపడుతున్నారు.
వారం గడిచినా అతీగతీలేదు
మదనపడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ప్రతి నెలా మాదిరే... ఈసారి వేతన జీవులు నిరీక్షిస్తున్నారు. జీతం ఎప్పుడు వస్తుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ వారం రోజులుగా ఆత్రుతతో ఆరాటపడుతున్నారు. ఇప్పటి దాకా అతీగతీలేకపోవడంతో ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు తప్పడం లేదు. జీతంపై ఆధారపడి బతుకీడుస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛనర్ల పరిస్థితి దయనీయంగా మారింది. రోజువారి ఖర్చులకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1.37 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. పోలీసు శాఖలో కొందరికి, పెన్షనర్లు, గ్రామవార్డు ఉద్యోగులకే వేతనం వచ్చినట్లు తెలుస్తోంది. 30 శాతం దాకా వేతనాలు జమ అయినట్లు ఓ ఖజానా అధికారి పేర్కొన్నారు. వారం గడిచినా ఇంకా 70 శాతం మందికి జీతం రావాల్సి ఉంది.
అప్పు పుట్టిందా.. లేదా..
ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టే అప్పుపైనే జీతాలు ఆధారపడ్డాయి. క్రమంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమవుతుందో ‘లెక్క’ బయటకు పొక్కడం లేదు. గతనెల ఆఖరులో రూ.1500 కోట్లకుపై రుణం లభించడంతో కొందరికి జీతం పడినట్లు చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో కొందరు ఉద్యోగులకు జమ అయ్యాయి. ఆ తర్వాత రుణం దొరకలేదన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రానికి పుట్టే అప్పును బట్టే జీతాల చెల్లింపు ఉంటుందని భావిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపు ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. ఆరు మాసాలకుపైగా ప్రతి నెలా ఇరవై తేదీ దాకా జీతాలు విడతల వారీగా జమ అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 18 ఖజానా కార్యాలయాలకు డీడీఓల నుంచి బిల్లుల అప్లోడ్ నిర్దేశిత గడువులో పూర్తి చేశారు. ఇక్కడి నుంచి రాష్ట్ర సీఎఫ్ఎంఎస్కు బిల్లుల ప్రక్రియ చేరింది. అక్కడి నుంచి బిల్లుల వారీగా ఆర్బీఐకి చెందిన ఈ-కుబేర్కు పంపారు.
ఆందోళన బాటలో..
సకాలంలో జీతాలు రాకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఒకటో తేదీనే జీతం వచ్చేలా చట్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఒకటి రెండు రోజుల్లో వేతనాలు పడకపోతే నిరసన బాట పట్టాలన్న కోణంలో సంఘాలు కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి. గతంలో పెన్షనర్ల సంఘం అనంత కలెక్టరేట్ ఆవరణలో పెద్దఎత్తున ఆందోళనకు దిగింది. ఈదఫా కొందరు పింఛనర్లకు వేతనం అందింది. ఉపాధ్యాయ సంఘాలల్లో చాలా వరకు ఉమ్మడి ఆందోళనకు దిగాలని ఆలోచన చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేడు
[ 28-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాల్లో ప్రజాగళం పేరిట పర్యటించనున్నారు. -
జలకళ ఏదీ జగన్?
[ 28-03-2024]
జలకళ పథకాన్ని సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న రైతుల్లో అర్హులందరికీ పొలాల్లో బోర్లు తవ్విస్తాం అని ఊదరగొట్టారు. పథకం ప్రారంభమైన కొన్ని రోజులకే మడమ తిప్పారు. -
ధర్మవరం భాజపాకే కూటమి అభ్యర్థిగా సత్యకుమార్
[ 28-03-2024]
-
పోలింగ్ కేంద్రం పక్కనే కోడ్ ఉల్లంఘన
[ 28-03-2024]
అక్కడా.. ఇక్కడా ఎందుకు? డైరెక్టుగా పోలింగ్ కేంద్రం పక్కనే కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా.. పట్టించుకునేవారే కరవయ్యారు. -
సీఎం సభకు బస్సులు.. ప్రయాణికుల పాట్లు
[ 28-03-2024]
సీఎం జగన్ ఇతర జిల్లాల్లోని ఎన్నికల పర్యటన సందర్భంగా కళ్యాణదుర్గం డిపో నుంచి 26 బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఐదేళ్లయినా అధికారులిక్కడే..
[ 28-03-2024]
మున్సిపల్ విభాగంలో పలువురు కీలక అధికారులు ఒకేచోట మూడేళ్లు దాటినా అక్కడే ఉంటున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నందువల్లే వారిని బదిలీ చేయడం లేదన్న విమర్శ ఉంది. -
మంచినీరు వృథా.. వ్యధ..
[ 28-03-2024]
ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. -
భూగర్భ మురుగు కాలువ వ్యవస్థకు మోక్షమెన్నడు?
[ 28-03-2024]
గుంతకల్లు మున్సిపాలిటీలో సమగ్ర భూగర్భ మురుగు కాలువల వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నివేదిక మూలనపడింది. పట్టణంలో రోడ్లు బాగున్నా.. సరైన కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తుంది. -
తాగునీటి సమస్య పరిష్కరించకుండా విమర్శలా?
[ 28-03-2024]
నగర ప్రజలంతా తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతుంటే సమస్యను పరిష్కరించకుండా వైకాపా నాయకులు తెదేపాపై అనవసర విమర్శలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గౌస్మోహిద్దీన్ మండిపడ్డారు. -
అనంత నగరపాలక కార్యాలయంలో సినిమా చిత్రీకరణ
[ 28-03-2024]
అనంత నగరపాలక కార్యాలయ ఆవరణలో సినిమా చిత్రీకరణపై విమర్శలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నగరపాలక కార్యాలయంలో సెట్టింగ్లతో సినిమా తీశారు. -
30 నుంచి భవిత కేంద్రాల్లో శిబిరాలు
[ 28-03-2024]
ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జల్లాలో గుర్తించిన భవిత కేంద్రాల్లో దివ్యాంగ పిల్లలకు అసెస్మెంట్ శిబిరాలు నిర్వహించనున్నట్లు అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మీనాక్షి తెలిపారు. -
సి-విజిల్ ఫిర్యాదులు పరిష్కరించండి
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి మేరకు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు, కార్యాలయాల్లో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రకటనలు హోర్డింగ్లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు. -
ఖాద్రీశుడి సమ్మోహనం
[ 28-03-2024]
కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మోహినీ అలంకారంలో ఖాద్రీశుడు దర్శనమిచ్చారు. ఆలయం నుంచి బయలుదేరిన స్వామి తిరువీధుల్లో విహరించారు. -
రూ.1.67 కోట్ల మళ్లింపుపై కేసు
[ 28-03-2024]
కదిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ విభాగంలో క్షేత్రస్థాయి అధికారి (ఫీల్డ్ ఆఫీసర్) వెంకటనాయుడు ఓడీ ఖాతా నుంచి సేవింగ్ ఖాతాలకు సుమారు రూ.1.67 కోట్లు మళ్లించిన వ్యవహారంపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సైబర్ పోలీసుల అదుపులో చిలమత్తూరు యువకుడు
[ 28-03-2024]
హైదరాబాద్ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సంజీవరాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. -
నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ముగ్గురు వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మంగళవారం వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్థానిక గ్రామ వాలంటీర్లు శివయ్య, రమేశ్, మహబూబ్ బాషాలను విధుల నుంచి తొలగిస్తూ బుధవారం ఎంపీడీవో విజయలలిత ఉత్తర్వులు జారీ చేశారు. -
పది పరీక్షలకు 2,203 మంది గైర్హాజరు
[ 28-03-2024]
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షతో ముగిసాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్