16 ఏళ్లు.. ప్రారంభమవని యూనిట్లు
రాయదుర్గం టెక్స్టైల్ పార్కులో అన్ని సౌకర్యాలు కల్పించినా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లు ప్రారంభించకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరటం లేదు.
రాయదుర్గం టెక్స్టైల్ పార్కు తీరిది
మూతపడిన కుట్టుశిక్షణ కేంద్రం
రాయదుర్గం: రాయదుర్గం టెక్స్టైల్ పార్కులో అన్ని సౌకర్యాలు కల్పించినా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లు ప్రారంభించకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరటం లేదు. పట్టణ శివారున 74.ఉడేగోళం వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 కోట్లకు పైగా వెచ్చించి టెక్స్టైల్ పార్కు ఏర్పాటుచేశారు. 2006లో పారిశ్రామికవేత్తలకు 55 ప్లాట్లు కేటాయించినా కేవలం ఏడుగురు మాత్రమే ఏర్పాటు చేశారు. మిగిలిన 48 మంది ప్లాట్లు వదులుకోకపోగా యూనిట్ల ఏర్పాటుకు కూడా ముందుకు రావటం లేదు. ఐదేళ్లుగా ప్రారంభించకపోతే రద్దు చేస్తామని చేనేత, జౌళిశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా సాకులు చూపుతూ పారిశ్రామికవేత్తలు ముందుకు రావటంలేదు. ఆ స్థలం నిరుపయోగంగా మారింది. ప్రారంభమైన ఏడు యూనిట్లలో మూడు మూతపడ్డాయి. మరో రెండు పూర్తిస్థాయిలో, మిగిలిన రెండు నత్తనడకన సాగుతున్నాయి. వాటిలో కొందరు యూనిట్ల విక్రయాలకు కూడా సిద్ధమవుతున్నారు. అన్ని యూనిట్లు నడుస్తున్నప్పుడు సుమారు 600 మందికి ఉపాధికి దొరికేది, ఇప్పుడు 300 మందికే పనులు లభిస్తున్నాయి. చాలామంది బళ్ళారి, బెంగళూరు, ముంబయిలాంటి నగరాలకు వలస వెళ్లారు.
* ఆరంభంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నప్పుడు దేవాదాయశాఖ పరిధి నుంచి చేనేత, జౌళిశాఖకు భూముల బదిలీ జరగలేదు. సేల్ ఆఫ్ అగ్రిమెంట్లు లేక వ్యాపారవేత్తలు ముందుకురాలేదు.
* గతంలో టెక్స్టైల్ పార్కులోని కామన్ ఫెసిలిటీ సెంటర్(సీఎఫ్సీ)లో మహిళలకు 45 రోజుల పాటు ఏడాదికి మూడు, నాలుగుమార్లు శిక్షణ ఇచ్చేవారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం శిక్షణ నిలిపేయడంతో నాలుగేళ్లుగా దుస్తులు కుట్టేందుకు అవసరమైన నైపుణ్యం ఉన్న కార్మికులు లభ్యం కావడంలేదు. సీఎఫ్సీలోని కుట్టుయంత్రాలు నిరుపయోగమయ్యాయి.
* టెక్స్టైల్ పార్కులో చేనేత, జౌళికి సంబంధించిన యూనిట్లే ఏర్పాటు చేయాల్సి ఉండటంతో ప్రారంభానికి వ్యాపారులు ముందుకు రావటం లేదు. కాలుష్యం పేరుతో మరమగ్గాల ఏర్పాటుకు అధికారులు అంగీకరించటం లేదు.
ఖాళీగా స్థలం
వారంలోపు కుట్టుశిక్షణ ప్రారంభం..
- అప్పాజి, ఏడీ, జిల్లా చేనేత, జౌళిశాఖ, అనంతపురం
టెక్స్టైల్ పార్కులో వారంలోపు కుట్టుశిక్షణ ప్రారంభిస్తాం. చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ అనుమతి తీసుకుని 48 యూనిట్ల ప్రారంభానికి నోటీసులు జారీ చేస్తాం. ఆసక్తి ఉన్నవారికి ప్లాట్లు కేటాయిస్తాం. పార్కు నిర్వహణకు చర్యలు తీసుకుంటాం.
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి..
- చమ్మా ఇబ్రహీం, టెక్స్టైల్ పార్కు వ్యాపారుల సంఘం కార్యదర్శి
టెక్స్టైల్ పార్కులో యూనిట్ల ఏర్పాటుకు, ప్రస్తుతం కరోనాతో దెబ్బతిన్న యూనిట్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద రాయితీలు ఇవ్వాలి. కరోనా సమయంలో అదనపు రుణం, ఏడాదిపాటు వడ్డీల వాయిదాలు మాత్రమే ఇచ్చింది. రుణాలు మాఫీ చేయలేదు. ఇకనైనా మరిన్ని ప్రోత్సాహకాలను ప్రకటించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
[ 19-04-2024]
ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!