logo

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో ఓ నిందితుడికి జీవితఖైదు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ ఏడో అదనపు జిల్లా న్యాయస్థానం, కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి తిరుమలరావు సోమవారం తీర్పును వెలువరించారు.

Published : 21 Mar 2023 03:12 IST

అనంతపురం (మూడోరోడ్డు), న్యూస్‌టుడే : హత్య కేసులో ఓ నిందితుడికి జీవితఖైదు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ ఏడో అదనపు జిల్లా న్యాయస్థానం, కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి తిరుమలరావు సోమవారం తీర్పును వెలువరించారు. శింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన నారాయణస్వామిని అదే గ్రామానికి చెందిన పట్రా రాంగోపాల్‌ కిరాతకంగా హత్య చేశాడు. నారాయణస్వామి ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని రాంగోపాల్‌ అనుమానం పెంచుకున్నాడు. 2021 ఫిబ్రవరి 5వ తేదీన హతుడు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా సమీపంలోని పత్తి చేనులో వేటకొడవళ్లతో దాక్కొని ఉన్న రాంగోపాల్‌ విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. ఈఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శింగనమల ఎస్సై మస్తాన్‌ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ విజయభాస్కర్‌గౌడు కేసు విచారణ చేపట్టి కోర్టుకు నివేదికను అందజేశారు. కోర్టు 13 మంది సాక్షులను విచారించింది. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ నాగరాజబాబు వాదనలు వినిపించారు. నిందితుడిపై నేరారోపణ రుజువు కావడంతో శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని